Assembly elections | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల (Maharashtra Assembly Elections) పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటల వరకూ 45.53 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అదే సమయంలో జార్ఖండ్లోనూ 61.47 శాతం ఓటింగ్ జరిగినట్లు వెల్లడించారు.
మహా ఎన్నికల్లో బాలీవుడ్ తారలు పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మాధురీ దీక్షిత్, రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ, అర్జున్ కపూర్, ప్రేమ్ చోప్రా, సింగర్ కైలాశ్ ఖేర్, సునీల్ శెట్టి, రితేశ్ దేశ్ముఖ్, జెనీలియా, సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ ఖాన్, పూనమ్ దిల్లాన్, జునైద్ ఖాన్, జావెద్ అక్తర్, మనీశ్ మల్హోత్ర, సింగర్ శంకర్ మహదేవన్, డైరెక్టర్ రోహిత్ శెట్టి తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ సైతం తన కుమారులు, కోడలితో కలిసి ముంబైలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.
మహారాష్ట్రలో(Maharashtra) మొత్తం 288 శాసనసభ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. 9.63 కోట్ల మంది ఓటర్లు 4 వేల 136 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుండగా 31 సమస్యాత్మాక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనున్నది. ఈ నెల 23 మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
Assembly elections | Till 3 pm, 45.53% voter turnout recorded in Maharashtra and 61.47% in the second & final phase of polling in Jharkhand, as per Election Commission of India pic.twitter.com/JiCFeTqe52
— ANI (@ANI) November 20, 2024
Also Read..
Mukesh Ambani | ఫ్యామిలీతో కలిసి ఓటేసిన ముకేశ్ అంబానీ.. VIDEO
Hit And Run | బైక్ను ఢీ కొట్టి ఈడ్చుకెళ్లిన బీఎండబ్ల్యూ కారు.. జర్నలిస్ట్ మృతి