లక్నో : (Lakhimpur Kheri) ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ ఘటనలో మరో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి అరెస్ట్తో ఇప్పటివరకు అదుపులోకి తీసుకున్న వారి సంఖ్య 13 మందికి చేరింది. లఖింపూర్ ఖేరీ పట్టణంలో ఈ నెల 3న జరిగిన అల్లర్ల తర్వాత జరిగిన హింసలో నలుగురు రైతులతోపాటు ఎనిమిది మంది మరణించారు. ఈ హింసాకాండ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చాలా యాక్టివ్గా మారింది. ఈ కేసులో ముఖ్యమంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఎనిమిది మంది పోలీసుల రిమాండ్లో ఉన్నారు.
లఖింపూర్ ఖేరి హింస కేసును దర్యాప్తు చేస్తున్న సిట్.. శనివారం మరో ముగ్గురు వ్యక్తులు మోహిత్ త్రివేది, ధర్మేంద్ర సింగ్, రింకు రాణాను అరెస్టు చేసింది. సంఘటన జరిగిన సమయంలో వీరు స్కార్పియో వాహనంలో ఉన్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. టికునియా హింస కేసులో ఇప్పటివరకు మొత్తం 13 మందిని అరెస్టు చేశారు. రైతుల హత్యకు సంబంధించి నమోదైన కేసులో పది మంది నిందితులను సిట్ ఇప్పటికే అరెస్టు చేసింది. వీరిలో తీవ్రంగా గాయపడిన లవకుశ, ఆశిష్ పాండే పోలీస్ లైన్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన ఎనిమిది మంది లఖింపూర్ ఖేరీ జిల్లా జైలులో ఉన్నారు. నిందితులను ఏకకాలంలో అరెస్టు చేయకపోవడంతో ఇప్పటివరకు నలుగురు నిందితులను విచారించగా, వారి వాంగ్మూలాలు విరుద్ధంగా వచ్చాయి. శనివారం మరోసారి ఏకకాలంలో ఎనిమిది మందిని విచారించేందుకు సిట్ ఏర్పాట్లు చేసింది.
హైబీపీ ఉన్నదని తెలిపే లక్షణాలివే..!
ఫైజాబాద్ రైల్వేస్టేషన్ ఇక అయోధ్య కంటోన్మెంట్!
బంగ్లాదేశ్లో హిందువులపై దాడికి వ్యతిరేకంగా ఇస్కాన్ ప్రదర్శనలు
యాపిల్ దశ దిశను మార్చిన తొలి ఐపాడ్
జమ్ములో హోం మంత్రి పర్యటన.. అమరుల కుటుంబాలకు పరామర్శ
ఈ చెక్క కత్తి .. స్టీల్ కత్తి కంటే వెరీ షార్ప్ గురూ!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..