శ్రీనగర్ : (Amit Shah) కేంద్ర హోంమంత్రి అమిత్ షా మూడు రోజుల పర్యటన నిమిత్తం శనివారం శ్రీనగర్ చేరుకున్నారు. ఆయన రెండు రోజులు శ్రీనగర్లో, ఒక రోజు జమ్ములో గడపనున్నారు. ఆర్టికల్ 370 రద్దు చేసిన దాదాపు 25 నెలల తర్వాత తొలిసారి ఆయన జమ్ముకశ్మీర్లో పర్యటిస్తున్నారు. శ్రీనగర్ విమానాశ్రయంలో అమిత్షాకు జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో పాటు పలువురు ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం పలికారు. తీవ్రవాదానికి వ్యతిరేకంగా భద్రతా ఏర్పాట్లను సమీక్షించడానికి హోం మంత్రి జమ్ముకశ్మీర్ వచ్చినట్లు సమాచారం.
తొలుత నేరుగా నౌగాం చేరుకున్న అమిత్షా.. అక్కడ సీఐడీ ఇన్స్పెక్టర్ పర్వేజ్ అహ్మద్ దార్ ఇంటికి చేరుకుని ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం అక్కడి నుంచి జవాన్ పర్వేజ్ అహ్మద్ ఇంటికి వెళ్లి నివాళులర్పించారు. పర్వేజ్ అహ్మద్ ధైర్యసాహసాలకు నాతో పాటు మొత్తం దేశం గర్వపడుతున్నదని అమిత్షా చెప్పారు. అతని కుటుంబ సభ్యులను కలుసుకుని పరామర్శించారు. అతడి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
ఇటీవల కశ్మీర్లో సాధారణ వ్యక్తులపై ఉగ్రవాద దాడుల నేపథ్యంలో భద్రతా దృక్కోణంలో షా పర్యటన చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తున్నారు. అమిత్షా పర్యటనను దృష్టిలో ఉంచుకుని, హోం మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా స్నిపర్లు, డ్రోన్లు, షార్ప్షూటర్లను మోహరించింది. రా చీఫ్ సమంత్ కుమార్ గోయెల్, సీనియర్ ఆర్మీ అధికారులు, ఐబీ చీఫ్తో పాటు 12 మంది భద్రతా ఉన్నతాధికారులతో రాజ్భవన్లో అమిత్షా ఉన్నత స్థాయి సమావేశం కూడా నిర్వహించనున్నారు.
ఆర్యన్ ఖాన్ తర్వాత.. ఇప్పుడు ‘స్టార్ కిడ్స్’పై ఎన్సీబీ కన్ను
ఇ-వ్యర్థాల నుంచి బంగారు నాణేలు.. బ్రిటన్ రాయల్ మింట్ చొరవ
ఈ చెక్క కత్తి .. స్టీల్ కత్తి కంటే వెరీ షార్ప్ గురూ!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..