(e-Wastage) లండన్ : పనికిరాని స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లను పక్కన పడేసి కొత్తవి కొంటుంటాం. అయితే, ఈ స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లలో బంగారంతోపాటు పలు విలువైన లోహాలు ఉంటాయన్న విషయం మీకు తెలుసునా? స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్ల తయారీలో బంగారం, వెండితోపాటు ఎన్నో లోహాలను వాడుతుంటారు. చాలా దేశాల్లో ఇ-వ్యర్థాల నుంచి బంగారం, వెండిని వేరు చేసే ప్రక్రియ చేపడుతున్న ఎన్నో సంస్థలు ఉన్నాయి. గాడ్జెట్స్ రీసైక్లింగ్ చేయడం ద్వారా విలువైన లోహాలను సంగ్రహించి కోట్లకు పడగలెత్తుతున్న వారు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఇ-వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడం కూడా సెకండ్లలో పూర్తిచేసే సాంకేతికత కూడా అందుబాటులోకి వచ్చింది. దాంతో ఇ-వ్యర్థాలను తగ్గించేందుకు బ్రిటన్కు చెందిన రాయల్ మింట్ కొత్త పనికి శ్రీకారం చుట్టింది.
కెనడియన్ సంస్థ ఆక్సియర్ సహకారంతో రాయల్ మింట్.. స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లను రీసైకిల్ చేస్తున్నది. ఇటీవల సౌత్ వేల్స్లో చేపట్టిన ట్రయల్స్ విజయవంతమయ్యాయి. బంగారంతోపాటు వెండి, పల్లాడియం, రాగిని కూడా వేరు చేశారు. కొత్త టెక్నాలజీ సహాయంతో కొన్ని సెకండ్లలోనే పాడైపోయిన గాడ్జెట్ల సర్క్యూట్ బోర్డ్ నుంచి వివిధ లోహాలను వేరుచేస్తున్నట్లు రాయల్ మింట్ వెల్లడించింది. ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి 99 శాతం వరకు ఇ-వ్యర్థాల నుంచి లోహాలను వేరు చేసే వీలున్నది.
ఇ-వ్యర్థాలను రీసైక్లింగ్ చేసేందుకు అందుబాటులోకి వచ్చిన ఈ కొత్త విధానం గొప్ప విజయమని రాయల్ మింట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అన్నే జెస్సోప్ చెప్పారు. భవిష్యత్లో యూకే విలువైన లోహాల కేంద్రంగా మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. ఇది ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి కూడా సాయపడుతుందని, ఇది విప్లవాత్మక దశ అని రాయల్ మింట్ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ సీన్ మిల్లార్డ్ చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా ఏటా 50 మిలియన్ టన్నుల ఇ-వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో 20 శాతం మాత్రమే రీసైకిల్ చేస్తున్నారు. ఇ-వ్యర్థాలు ఇలా పెరుగుతూ ఉంటే.. 2030 నాటికి ఈ సంఖ్య 70 మిలియన్ టన్నులకు చేరుకుంటుందని పర్యావరణవేత్తలు విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలోని బంగారంలో 7 శాతం వరకు ఇ-వ్యర్థాలలో ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
ఈ చెక్క కత్తి .. స్టీల్ కత్తి కంటే వెరీ షార్ప్ గురూ!
డెన్మార్క్ ఓపెన్లో క్వార్టర్ ఫైనల్స్ చేరిన సింధు
పట్టాభికి 14 రోజుల రిమాండ్, మచిలీపట్నం జైలుకు తరలింపు
మళ్లీ మొదలైన శ్రీశైలం గిరిప్రదక్షిణం
బోయలు, వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చండి : ప్రధానికి చంద్రబాబు విజ్ఞప్తి
నవంబర్ 1 నుంచి ఏపీ పాఠశాలల్లో నూతన విద్యా విధానం
దేవరగట్టు కర్రల యుద్ధంలో ఉద్దేశపూర్వక దాడులు : 14 మంది అరెస్ట్
అధికారం దక్కలేదన్న అక్కసుతోనే దాడులు : జగన్
ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఏం చేయాలో.. చేసి చూపిస్తా: చంద్రబాబు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..