(CM Jagan) అమరావతి : విజయవాడలో పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో జగన్ పాల్గొని అమర పోలీసులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలీసులకు వీక్లీ ఆఫ్ను ప్రకటించిన ప్రభుత్వం తమదేనని చెప్పారు. అధికారం దక్కలేదన్ని కోపంతో కొందరు రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సంక్షేమ పథకాలను అడ్డుకోవాలనే దురుద్దేశంతోనే కోర్టుల్లో కేసులు వేస్తున్నారని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం, డీఆర్ఐ వివరణ ఇచ్చనప్పటికీ తమపై కోపంతో విజయవాడ సీపీతోపాటు డీజీపీపై అబద్ధాల ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. చీకట్లో ఆలయాల రథాలను తగలబెట్టించడమే కాకుండా, సీఎంపైనా అసభ్యపదజాలం వాడతున్నారని తెలిపారు. రాష్ట్రంలో వాళ్లు అధికారంలోకి రానందుకు కోపంతో రాష్ట్రం పరువు తీసేందుకు వెనకాడటం లేదన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలు, నాయకులు జనాగ్రహ దీక్షలు చేపట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై టీడీపీ నేత పట్టాభిరామ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ దీక్షలు చేపట్టారు. ఈ దీక్షల్లో వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జనాగ్రహం పేరుతో అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. సీఎం జగన్ను అసభ్య పదజాలంతో దూషించారని, టీడీపీ నేతలు శాంతి, భద్రతలకు విఘాతం కలిగిస్తున్నదని వైసీపీ నేతలు ఆరోపించారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఏం చేయాలో.. చేసి చూపిస్తా: చంద్రబాబు
డిసెంబర్ నుంచి టీవీ వీక్షణం.. చాలా కాస్ట్లీ గురూ!
ఇది ప్రపంచంలోనే అతిచిన్న గేమ్ కన్సోల్..!
ఒత్తిడితో సతమతమవుతున్నారా? అయితే, ఈ ‘క్రైయింగ్ రూం’కు రండి!
ఎంతటి రసికుడవో తెలిసెరా.. బిల్ గేట్స్ రహస్యాలు బట్టబయలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..