(Babu letter) విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాల్మీకి / బోయ సామాజికవర్గాన్ని షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) జాబితాలో చేర్చాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోరారు. మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా ప్రధానికి చంద్రబాబు లేఖ రాసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టడం ద్వారా ఏపీలోని వాల్మీకులు / బోయలను ఎస్టీలుగా గుర్తించాలని ఆ లేఖలో కోరారు.
వాల్మీకులు, బోయల డిమాండ్కు సంబంధించి కేంద్రం వద్ద చాలాకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యను పరిష్కరించాల్సిన అవసరాన్ని చంద్రబాబు నొక్కిచెప్పారు. ఆంధ్రప్రదేశ్లోని మైదాన ప్రాంతాల్లో నివసిస్తున్న ఈ రెండు వర్గాలు కడు పేదరికంలో మగ్గుతున్నాయని చెప్పారు. ఈ సంఘాలు సాంప్రదాయకంగా వేట, అటవీ ఉత్పత్తుల సేకరణ ద్వారా జీవనోపాధిని వెతుక్కుంటున్నాయని పేర్కొన్నారు. అనంతరామ కమిషన్, అనేక ఇతర ప్యానెళ్లు అనుకూలమైన సిఫార్సులు చేసినప్పటికీ వాల్మీకి, బోయ కులాలను ఎస్టీ జాబితాలో చేర్చలేదని చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు.
నవంబర్ 1 నుంచి ఏపీ పాఠశాలల్లో నూతన విద్యా విధానం
దేవరగట్టు కర్రల యుద్ధంలో ఉద్దేశపూర్వక దాడులు : 14 మంది అరెస్ట్
అధికారం దక్కలేదన్న అక్కసుతోనే దాడులు : జగన్
ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఏం చేయాలో.. చేసి చూపిస్తా: చంద్రబాబు
డిసెంబర్ నుంచి టీవీ వీక్షణం.. చాలా కాస్ట్లీ గురూ!
ఒత్తిడితో సతమతమవుతున్నారా? అయితే, ఈ ‘క్రైయింగ్ రూం’కు రండి!
ఎంతటి రసికుడవో తెలిసెరా.. బిల్ గేట్స్ రహస్యాలు బట్టబయలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..