(Pattabhi) అమరావతి : టీడీపీ నాయకుడు పట్టాభికి విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. బుధవారం పట్టాభిని అరెస్ట్ చేసిన పోలీసులు ఇవాళ ఉదయం విజయవాడ మూడవ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. దాంతో ఆయనకు వచ్చే నెల 2 వరకు రిమాండ్ విధించారు. దాంతో పట్టాభిని పోలీసులు మచిలీపట్నం జైలుకు తరలించారు. ముఖ్యమంత్రి జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
జగన్ను దూషించాన్న ఆరోపణలపై అరెస్ట్ చేసిన టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని పోలీసులు మూడవ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు పర్చారు. ఆయన తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఆయన ఇంటిపై పలుమార్లు దాడి పాల్పడ్డారని పట్టాభి తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సీఎంని గానీ, ప్రభుత్వంలో ఉన్న వారిని గానీ వ్యక్తిగతంగా విమర్శించ లేదని పేర్కొన్నారు. కేవలం ప్రభుత్వంలో ఉన్న లోపాలను మాత్రమే మీడియాలో ప్రస్తావించారంటూ న్యాయమూర్తికి పట్టాభి తరఫు న్యాయవాదులు వివరించారు. తనకు, తన కుటుంబానికి ప్రాణ హాని ఉందని న్యాయమూర్తికి తెలిపారు. కేసును విచారించిన న్యాయమూర్తి, పట్టాభికి 14 రోజుల రిమాండ్ విధించారు. దాంతో పోలీసులు ఆయనను మచిలీపట్నం జైలుకు తరలించారు.
మళ్లీ మొదలైన శ్రీశైలం గిరిప్రదక్షిణం
బోయలు, వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చండి : ప్రధానికి చంద్రబాబు విజ్ఞప్తి
నవంబర్ 1 నుంచి ఏపీ పాఠశాలల్లో నూతన విద్యా విధానం
దేవరగట్టు కర్రల యుద్ధంలో ఉద్దేశపూర్వక దాడులు : 14 మంది అరెస్ట్
అధికారం దక్కలేదన్న అక్కసుతోనే దాడులు : జగన్
ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఏం చేయాలో.. చేసి చూపిస్తా: చంద్రబాబు
డిసెంబర్ నుంచి టీవీ వీక్షణం.. చాలా కాస్ట్లీ గురూ!
ఒత్తిడితో సతమతమవుతున్నారా? అయితే, ఈ ‘క్రైయింగ్ రూం’కు రండి!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..