బెంగళూరు: కర్ణాటకలో బీజేపీని గద్దె దించడానికి తమ పార్టీ ఇచ్చిన ఓ నినాదం బాగా పనిచేసిందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, రాజస్థాన్ ఎమ్మెల్యే సచిన్ పైలట్ అన్నారు. కర్ణాటకలో కాంట్రాక్టర్ల నుంచి బీజేపీ సర్కారు 40 శాతం చొప్పున కమిషన్లు వసూలు చేసిందని, ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లిందని ఆయన చెప్పారు.
ఫార్టీ పర్సెంట్ కమిషన్ గవర్నమెంట్ అంటూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నినాదాన్ని కర్ణాటక ప్రజలు అంగీకరించారని, బీజేపీ ఘోర పరాభవానికి ఆ నినాదమే బాగా పనిచేసిందని సచిన్ పైలట్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం దేశంలో బీజేపీ పతనానికి నాంది అని ఆయన వ్యాఖ్యానించారు.
#WATCH | #KarnatakaElectionResults | Congress leader Sachin Pilot says, “Congress has the majority. We will have a thumping victory. The slogan of “40% commission government” given by us, was accepted by the public. It was a major issue raised by us to defeat BJP. People accepted… pic.twitter.com/qg8gfkSSWD
— ANI (@ANI) May 13, 2023
Also Read..
Karnataka Assembly Election Results 2023 | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లైవ్ అప్డేట్స్