Karnataka Assembly Election Results 2023 | దేశమంతటా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 36 కేంద్రాల్లో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కాగా, గత ఎన్నికల అనుభవాల నేపథ్యంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడితే ఎలాంటి వ్యూహాలు అనుసరించాలనే అంశంపై కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ చాలా ముందు జాగ్రత్తతో ఉన్నాయి. గెలిచే అవకాశాలున్న స్వతంత్ర అభ్యర్థులకు, తమ పార్టీ తిరుగుబాటు అభ్యర్థులకు అవి గాలం వేస్తున్నాయి.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ దాదాపు పూర్తయ్యింది. మొత్తం 224 నియోజకవర్గాలకు గానూ 136 స్థానాల్లో గెలిచి కాంగ్రెస్ సంపూర్ణ ఆధిక్యాన్ని దక్కించుకుంది. ఇక బీజేపీ 65 స్థానాల్లో గెలవగా.. జేడీఎస్ 19, ఇతరులు 4 స్థానాల్లో గెలిచారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ప్రచారం చేసిన అన్ని స్థానాల్లో కాషాయ పార్టీ ఓటమిని చవిచూసింది. బండి ప్రచారం చేసిన కోలార్, చింతామణి, ముల్బగల్ స్థానాల్లో బీజేపీ మూడో స్థానంలో నిలవగా.. గౌరీబిదనూర్లో అయితే ఏకంగా ఐదో స్థానానికి పడిపోయింది. బాగేపల్లి, చిక్కబల్లాపూర్లో కూడా గెలవలేకపోయింది. ఈ విషయం ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్గా మారింది. బండి సంజయ్ ప్రచారం అంటే అట్లుంటది అని నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోవిధంగా కామెంట్లు పెడుతున్నారు.
‘బజరంగ్బలి’ (Bajrang Bali – హనుమంతుడు) కాంగ్రెస్తోనే ఉన్నారని, కర్ణాటక ఎన్నికల ఫలితాల ద్వారా ఇది స్పష్టమైందని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ అన్నారు. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.‘బజరంగ్బలి ఎవరితో ఉన్నారో మీరు చూశారు. బజరంగ్ బలి తన ‘గద’తో అవినీతి బీజేపీ తలపై కొట్టి ఓడించారు’ అని అన్నారు. కర్ణాటక ఎన్నికలను కేంద్రీకృతం చేయాలని భావించిన బీజేపీ ప్రయత్నాలు ఫలించలేదని భూపేష్ బఘేల్ విమర్శించారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Assembly Elections) ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి (Cm) బసవరాజు బొమ్మై (Basavaraj Bommai) తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఈరోజు సాయంత్రానికి పూర్తి స్థాయిలో ఫలితాలు వెల్లడైన తర్వాత సీఎం.. గవర్నర్కు రాజీనామా పత్రం సమర్పించనున్నట్లు తెలుస్తోంది.
చేనేతల ఆకాంక్షను అవహేళన చేసిన భారతీయ జనతా పార్టీకి కర్ణాటక ఎన్నికల్లో చేనేతలు సరైన బుద్ధి చెప్పారని అఖిల భారత పద్మశాలీ సంఘం చేనేత విభాగం నేత యర్రమాద వెంకన్న అన్నారు. చేనేతపై వేసిన జీఎస్టీ పన్నులు తొలగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, గ్రూప్ ఆఫ్ ఫైనాన్స్ మినిస్టర్స్ చైర్మన్ బస్వరాజ్ బొమ్మై పలుమార్లు విజ్ఞప్తి చేసినా పెడచెవిన పెట్టారని ఆరోపించారు. అపాయింట్మెంట్ అడిగితే అవహేళన చేసిన బస్వరాజ్ బొమ్మై కి తగిన గుణపాఠం చెప్పేందుకు గతేడాది అఖిల భారత పద్మశాలీ సంఘం కర్ణాటకలో పని చేస్తుందని, ప్రత్యేక వ్యూహాన్ని అమలుపరిచినట్లు తెలిపారు.
కేరళ స్టోరీ ఎలాగైతే కర్ణాటక ప్రజలను ఆకట్టుకోలేకపోయిందో.. అలాగే కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ఎటువంటి ప్రభావం చూపించబోదని మంత్రి కేటీఆర్ అన్నారు. అసహ్య, విభజన రాజకీయాలను వ్యతిరేకించినందుకు కర్ణాటక ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. పెట్టుబడులను ఆకర్షించడంలో.. మౌలిక సదుపాయాలను కల్పించడంలో హైదరాబాద్, బెంగళూరు మధ్య ఆరోగ్యకరమైన పోటీ నెలకొనాలని ఆకాంక్షించారు.
Just the way Kerala Story failed to amuse people of Karnataka, similarly Karnataka election results will have NO bearing on Telangana
Thanks to the people of Karnataka for rejecting ugly & divisive politics 🙏
Let Hyderabad and Bengaluru compete healthily for investments &…
— KTR (@KTRBRS) May 13, 2023
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంపట్ల ఆ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్గాంధీ సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి అపూర్వ విజయం కట్టబెట్టిన కర్ణాటక ప్రజలకు.. జాతీయ, రాష్ట్ర నాయకులకు.. కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. బీజేపీ ఓటమితో కర్ణాటకలో విద్వేష పాలన ముగిసిందని, కాంగ్రెస్ నేతృత్వంలో ప్రేమపూర్వక పాలన మొదలైందని వ్యాఖ్యానించారు. కర్ణాటకలోని పేద ప్రజలు.. ధనికులతో సహవాసం చేసే బీజేపీ సర్కారును ఓడించారని పేర్కొన్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పోటీ చేసినప్పటికీ బీజేపీ మంత్రి సోమన్నను ప్రజలు తిరస్కరించారు. వరుణ, చామరాజనగర నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నారు. వరుణలో మాజీ సీఎం సిద్ధరామయ్యపై 8354 ఓట్లు, చామరాజనగర్లో పుట్టరంగశెట్టిపై 7383 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో నిరాశనిస్పృహలకు గురైన కార్యకర్తల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు బీజేపీ సీనియర్ నేత యడ్యూరప్ప. బీజేపీకి గెలుపోటములు కొత్తేమీ కాదని.. కార్యకర్తలు ఆందోళన చెందవద్దంటూ వాళ్లకు ధైర్యం చెప్పారు. ప్రజాతీర్పును గౌరవిస్తున్నామని.. ఈ ఓటమిపై ఆత్మపరిశీలన చేసుకుని ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.
"Victory and defeat aren't new to BJP. Party workers need not be panicked by these results. We will introspect about the party's setback. I respectfully accept this verdict," says BJP leader BS Yediyurappa on the party's defeat in #KarnatakaElectionResults pic.twitter.com/LYudJZGIcL
— ANI (@ANI) May 13, 2023
కర్ణాటక ఎన్నికల చరిత్రలోనే అత్యంత వయోవృద్ధుడైన శివశంకరప్ప మరోసారి జయకేతనం ఎగురవేశారు. కాంగ్రెస్ నేత అయిన 92ఏళ్ల శివశంకరప్ప దావణగెరె దక్షిణ నియోజకవర్గం నుంచి వరసగా నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేసిన వయోవృద్ధుడిగా రికార్డు సృష్టించారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పాటు జేడీఎస్ పార్టీకి కూడా ఎదురుదెబ్బ తగిలింది. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పోలిస్తే ఈసారి జేడీఎస్ దారుణంగా దెబ్బతిన్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 37 స్థానాల్లో గెలుపొందగా.. ఈ ఎలక్షన్స్లో 21 స్థానాలకే పరిమితమైంది. కుమారస్వామి కొడుకు నిఖిల్ సైతం ఈ ఎన్నికల్లో విజయం సాధించలేకపోయారు.
డబ్బులతో ఎన్నికల్లో గెలవాలన్న బీజేపీ ప్రయత్నాలు ఫలించలేదని కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య అన్నారు. బీజేపీ నేతలు ఎన్నికల కోసం చాలా ఖర్చు చేశారని ఆయన ఆరోపించారు. 2018లోనూ ఆపరేషన్ కమలం జరిగిందని.. డబ్బులిచ్చి నేతలను కొనుగోలు చేశారని అన్నారు. అయితే విద్వేష రాజకీయాలను ప్రజలు ఉపేక్షించరని వ్యాఖ్యానించారు.
#WATCH | It is a mandate against Narendra Modi, Amit Shah and JP Nadda. PM came to Karnataka 20 times; No PM in the past campaigned like this: Congress leader Siddaramaiah on his party's victory in Karnataka elections pic.twitter.com/bNk1HMLk4y
— ANI (@ANI) May 13, 2023
హుబ్లీ ధార్వాడ్ సెంట్రల్ నుంచి బరిలోకి దిగిన మాజీ సీఎం జగదీశ్ షెట్టర్ ఓటమి పాలయ్యారు. చివరి నిమిషంలో బీజేపీ టికెట్ నిరాకరించడంతో పార్టీని వీడిన షెట్టర్.. కాంగ్రెస్లో చేరారు. ఆ పార్టీ నుంచి ఎన్నికల్లో నిలబడినప్పటికీ ఆయనకు పరాభవం తప్పలేదు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందడం పట్ల కేపీసీసీ చీఫ్ శివకుమార్ భావోద్వేగానికి గురయ్యారు. కర్ణాటకలో అతి పెద్ద విజయానికి కారణమైన పార్టీకార్యకర్తలు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. తమను గెలిపించిన ఓటర్లకు పాదాభివందనాలు తెలియజేశారు.
#WATCH | Karnataka Congress President DK Shivakumar gets emotional on his party's comfortable victory in state Assembly elections pic.twitter.com/ANaqVMXgFr
— ANI (@ANI) May 13, 2023
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కేఆర్పీపీ చీఫ్ గాలి జనార్ధన్ రెడ్డి గెలుపొందారు. గంగావతి స్థానం నుంచి పోటీ చేసిన ఆయన.. రెండు వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
ది కేరళ స్టోరీ సినిమాను తన ప్రచారం కోసం వాడుకుని.. విద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు ఎంత ప్రయత్నించినప్పటికీ కర్ణాటక ఓటర్లు బీజేపీ మాయలో పడలేదు. ప్రధాని మోదీ ఎంత ప్రచారం చేసినప్పటికీ బీజేపీని కర్ణాటక ప్రజలు తిప్పికొట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 224 నియోజకవర్గాలకు గానూ 69 స్థానాల్లోనే బీజేపీ ఆధిపత్యం కనబరిచింది. ముఖ్యంగా నరేంద్ర మోదీ ప్రచారం చేసిన 42 నియోజకవర్గాలకు గానూ 21 నియోజకవర్గాల్లో కాషాయ పార్టీ ఓటమిని చవిచూసింది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం దాదాపు ఖాయమైపోయింది. ఈ నేపథ్యంలో కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలతో కలిసి రేపు బెంగళూరులో సీఎల్పీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ కొత్త ఎమ్మెల్యేలు తమ శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు. అనంతరం తమను ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అనుమతించాలంటూ కాంగ్రెస్ నేతలు గవర్నర్కు వినతి పత్రం అందజేయనున్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని బీజేపీ అంగీకరించింది. ప్రధాని మోదీ, బీజేపీ కార్యకర్తలు ఎంత కష్టపడినప్పటికీ జనాల్లో మార్క్ చూపించలేకపోయామని సీఎం బసవరాజు బొమ్మై తెలిపారు. పూర్తి పలితాలు వచ్చిన తర్వాత ఎక్కడ లోపం జరిగిందో విశ్లేషించుకుంటామని చెప్పారు. వాటిని మార్చుకుని లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటుతామని ఆశాభావం వ్యక్తం చేశారు.
#WATCH | In spite of a lot of efforts put in by PM & BJP workers, we've not been able to make the mark. Once the full results come we'll do a detailed analysis. We take this result in our stride to come back in Lok Sabha elections: Karnataka CM Bommai#KarnatakaElectionResults pic.twitter.com/ftNLsV5HHG
— ANI (@ANI) May 13, 2023
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు దాదాపు ఖాయం కావడంతో దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ భగేల్ కూడా స్వీట్లు పంచి తన ఆనందాన్ని పంచుకున్నారు.
#WATCH | Raipur | Chhattisgarh CM Bhupesh Baghel distributes sweets as Congress gets the majority in #Karnataka.
As per the latest ECI trends, Congress surges ahead in 118 seats while BJP leads in 75 seats. pic.twitter.com/d9QuCfgxd9
— ANI (@ANI) May 13, 2023
కనకపురలో డీకే శివకుమార్
చల్లకెరెలో టి.రఘుమూర్తి
హిరియూర్లో సుధాకర్ గెలుపు
కుడ్లగిలో ఎన్టీ శ్రీనివాస్ గెలుపు
బళ్లారి రూరల్లో నాగేంద్ర
ధార్వాడ్ రూరల్లో కులకర్ణి
అథాని నుంచి లక్షణ్ సావడి
కల్ఘట్టి నుంచి సంతోశ్
ఎంకెన్మార్డిలో సతీశ్
చిత్రదుర్గలో వీరేంద్ర పప్పి
కనకపుర నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్ గెలుపొందారు.
కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ, జేడీఎస్ ఖాతా తెరిచాయి. ఎల్లపురా నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి శివరామ్, హసన్ నియోజకవర్గం నుంచి జేడీఎస్ అభ్యర్థి స్వరూప్ విజయం సాధించారు. ఇక చల్లెకెరె, మొలకల్మూర్, హరియూర్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు.
కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఖాతా తెరిచింది. చల్లెకెరె నియోజకవర్గం నుంచి టి.రఘుమూర్తి విజయం సాధించారు.
జేడీఎస్కు కంచుకోటగా ఉన్న పాత మైసూరులో కాంగ్రెస్ పాగా వేసింది. పాత మైసూరులో 61 స్థానాలు ఉండగా.. 34 సీట్లను సొంతం చేసుకుంది. ఇక జేడీఎస్ 22 స్థానాలతో రెండో ప్లేస్లో నిలిచింది. ఇక మూడు స్థానాలతో బీజేపీ మూడో ప్లేస్కు పరిమితమైంది.
కర్ణాటక అసెంబ్లీ ఫైట్లో కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ మార్క్ను దాటేసింది. దీంతో ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమైంది. ప్రస్తుతం ఆ పార్టీ 118 స్తానాల్లో లీడింగ్లో ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు 113 స్థానాలే కీలకం. అయితే తమ ఎమ్మెల్యేల(Congress MLAs)ను రక్షించుకునే పనిలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికైన ఎమ్మెల్యేలను తమిళనాడుకు షిప్ట్ చేయాలన్న యోచనలో కాంగ్రెస్ వర్గాలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీజేపీ గేమ్ప్లాన్ నుంచి తప్పించుకునేందుకు కాంగ్రెస్ ఈ ఎత్తు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. తమిళనాడులోని డీంఎకే నేతలతో కర్నాటక కాంగ్రెస్ నేతలు టచ్లో ఉన్నట్లు కొన్ని కథనాలు చెబుతున్నాయి.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని విజయం దక్కిందని ఆ పార్టీ నేత సచిన్ పైలట్ అన్నారు. బీజేపీ కమిషన్ల బాగోతంపై కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిన సమస్యపై ప్రజలు సానుకూలంగా స్పందించారని అన్నారు. 40 శాతం కమిషన్ల ప్రభుత్వం అని బీజేపీకి వ్యతిరేకంగా చేసిన నినాదానికి కర్ణాటక ఓటర్ల నుంచి విశేష స్పందన లభించిందని అన్నారు. అందువల్లే కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ దక్కిందని అన్నారు.
#WATCH | #KarnatakaElectionResults | Congress leader Sachin Pilot says, "Congress has the majority. We will have a thumping victory. The slogan of "40% commission government" given by us, was accepted by the public. It was a major issue raised by us to defeat BJP. People accepted… pic.twitter.com/qg8gfkSSWD
— ANI (@ANI) May 13, 2023
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉండటంతో ఆ పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నాయి. కర్ణాటకతో పాటు ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో టపాసులు కాల్చి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అప్పుడే సీఎం పీఠంపై అప్పుడే సిద్ధరామయ్య కొడుకు యతీంద్ర కర్చీఫ్ వేసేశారు. కాంగ్రెస్కు సంపూర్ణ మెజారిటీ దక్కుతుందని.. కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని యతీంద్ర సిద్ధరామయ్య తెలిపారు. ఒక కొడుకుగా సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా చూడాలని ఆకాంక్షిస్తున్నానని చెప్పారు. గతంలో ఆయన పాలనతో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని, ప్రజలకు సుపరిపాలన అందించారని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా ఆయన ముఖ్యమంత్రి అయితే బీజేపీ పాలనలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలను సరిచేస్తారని తెలిపారు. రాష్ట్ర ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారని.. ఆయన ముఖ్యమంత్రి అవుతారని నొక్కి చెప్పారు.
షిగ్గావ్ నియోజకవర్గంలో సీఎం బసవరాజు బొమ్మై ముందంజ
వరుణ నియోజకవర్గంలో మాజీ సీఎం సిద్ధరామయ్య ముందంజ
కనకపుర నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి డీకే శివకుమార్ ముందంజ
చెన్నపట్టణ నియోజకవర్గంలో జేడీఎస్ నేత కుమారస్వామి ముందంజ
హోలే నర్సీపూర్ నియోజకవర్గంలో జేడీఎస్ అభ్యర్థి హెచ్డీ రేవణ్ణ ముందజ
రామనగర నియోజకవర్గంలో జేడీఎస్ అభ్యర్థి నిఖిల్ కుమారస్వామి ముందంజ
గంగావతి నియోజకవర్గం నుంచి కేఆర్పీపీ అభ్యర్థి గాలి జనార్ధన్రెడ్డి ముందంజ
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ వెనుకంజలో ఉంది. ఈ నేపథ్యంలో ట్విట్టర్లో బీజేపీ ముక్త్ సౌతిండియా ( #BJPMuktSouthIndia ) హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. బీజేపీ విద్వేషపూరిత ప్రచారాలను దక్షిణాదిలోని విద్యావంతులు తిప్పికొట్టారని నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో జేడీఎస్ నేత కుమారస్వామి బెంగళూరులో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
#WATCH | Former Karnataka CM & JDS leader HD Kumaraswamy visits a temple in Bengaluru amid counting of votes for #KarnatakaPolls.#KarnatakaElectionResults pic.twitter.com/T2wCl2djAq
— ANI (@ANI) May 13, 2023
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా ప్రత్యేక పూజలు నిర్వహించారు. షిమ్లాలోని హనుమాన్ ఆలయంలో ఆమె ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దేశ, కర్ణాటక ప్రజల శాంతి, సామరస్యం కోసం ప్రియాంక గాంధీ ప్రార్థించారని కాంగ్రెస్ నేతలు తెలిపారు.
#WATCH | Congress General Secretary Priyanka Gandhi Vadra offers prayers at Shimla's Jakhu temple pic.twitter.com/PRH47u36Zm
— ANI (@ANI) May 13, 2023
భారీ మెజారిటీతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని.. ఇందులో ఎలాంటి సందేహం లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా తెలిపారు. రాష్ట్రంలో ప్రధాని విద్వేషపూరిత, వ్యతిరేక ప్రచారాలు పనిచేయలేవని అన్నారు.
#WATCH | "We will form the govt with a heavy majority, there's no doubt about it. Negative, divisive campaign of the PM did not work": Congress spokesperson Pawan Khera as the Congress inches ahead in #KarnatakaElectionResults pic.twitter.com/Zgy1dfLW1M
— ANI (@ANI) May 13, 2023
తనది చిన్న పార్టీ అని.. తనకు అంత డిమాండ్ లేదని జేడీఎస్ నేత కుమారస్వామి అన్నారు. హంగ్ వస్తే ఎవరికి సపోర్ట్ చేస్తారన్న ప్రశ్నకు స్పందించిన కుమారస్వామి.. ఇప్పటివరకు తనను ఎవరూ సంప్రదించలేదని తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం రెండు పెద్ద పార్టీలే భారీ స్కోర్ చేస్తాయని అన్నారు.
కర్ణాటకలో తొలి రౌండ్ ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. ఫస్ట్ రౌండ్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. 8 మంది బీజేపీ మంత్రులు వెనుకంజలో ఉన్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ముందంజలో ఉండటంతో కాంగ్రెస్ పార్టీ సంబురాలు చేసుకుంటుంది. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తలు డ్యాన్సులు చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
#WATCH | Celebrations underway at national headquarters of Congress party in New Delhi as counting of votes gets underway for #KarnatakaPolls. pic.twitter.com/e0eGObhLh3
— ANI (@ANI) May 13, 2023
ప్రస్తుతం హోరా హోరీ నడుస్తున్నప్పటికీ కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసేది బీజేపీయే అని ఆ పార్టీ అధికార ప్రతినిధి సయ్యద్ జాఫర్ ఇస్లాం ధీమా వ్యక్తం చేశారు. సొంతంగానే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
#KarnatakaPolls | "As of now, it seems to be a neck-to-neck fight but we will be able to form the govt": BJP spokesperson Syed Zafar Islam on initial trends in #KarnatakaAssemblyElection2023 pic.twitter.com/8OCAiggPZD
— ANI (@ANI) May 13, 2023
కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వస్తుందని మాజీ సీఎం సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ కావాల్సినంత మెజారిటీ రాకపోతే ఏం చేయాలనేది అధిష్ఠానమే నిర్ణయిస్తుందని తెలిపారు. బీజేపీని గద్దె దించేందుకు ఏం చేయడానికైనా సిద్ధమేనని పేర్కొన్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో సీఎం బసవరాజు బొమ్మై హుబ్లీలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ బీజేపీకి స్పష్టమైన ఆధిక్యం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కొనసాగుతోంది. తొలుత బీజేపీ ఆధిక్యంలో ఉన్నప్పటికీ.. క్రమంగా కాంగ్రెస్ పుంజుకుంది. ప్రస్తుతం ఆధిక్యంలోకి వచ్చింది.
గత ఎన్నికల అనుభవాల నేపథ్యంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడితే ఎలాంటి వ్యూహాలు అనుసరించాలనే అంశంపై కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ చాలా ముందు జాగ్రత్తతో ఉన్నాయి. గెలిచే అవకాశాలున్న స్వతంత్ర అభ్యర్థులకు, తమ పార్టీ తిరుగుబాటు అభ్యర్థులకు అవి గాలం వేస్తున్నాయి. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు శుక్రవారం ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు ఖర్గే నివాసంలో సమావేశమై చర్చించారు. తమ పార్టీ తరపున గెలిచే అవకాశాలున్న అభ్యర్థులను ఒకచోటికి చేర్చాలని నిర్ణయించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎవరైనా ఎగరేసుకుపోవచ్చు కదా అన్న ప్రశ్నపై కాంగ్రెస్ సీనియర్ నేత పరమేశ్వర స్పందిస్తూ ఈసారి తాము జాగ్రత్తగా ఉంటామన్నారు. ఫలితాలు వెలువడుతున్న తరుణంలోనే గెలిచే అవకాశాలున్న పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు వెంటనే బెంగళూరుకు చేరుకోవాలని కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశించింది. బీజేపీ తాయిలాలకు ఆశ పడవద్దని వారిని హెచ్చరించారు. మరోవైపు బీజేపీ కూడా కాంగ్రెస్లాగే స్వతంత్ర అభ్యర్థుల మద్దతు సంపాదించే పనిలో ఉంది. జేడీ(ఎస్) కూడా తమ పార్టీ తరపున ఎన్నికయ్యే ఎమ్మెల్యేలను ఒక్కచోట చేర్చాలని నిర్ణయించింది.
రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితులు తలెత్తితే, తమ వద్ద ఉన్న చెప్పుకోదగ్గ ఎమ్మెల్యేల సంఖ్యతో అనుకున్న డిమాండ్లు సాధించవచ్చని జేడీ(ఎస్) భావిస్తున్నది. సీఎం పదవిని మాకే ఇవ్వాలనే డిమాండ్తో కాంగ్రెస్తోనైనా, బీజేపీతోనైనా పొత్తు పెట్టుకొనే సూచనలున్నాయని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలున్నాయన్న ఎగ్జిట్ పోల్ అంచనాలతో అధికార బీజేపీలో కలవరం మొదలైంది. కౌంటింగ్కు ముందే ఆ పార్టీ ‘ఆపరేషన్ లోటస్’కు తెర తీసింది. ఈ విషయాన్ని స్వయంగా ఆ పార్టీ నేత, ఆ రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి అశోక శుక్రవారం బహిరంగంగానే మీడియాకు వెల్లడించారు. పైగా ఈ ‘ఆపరేషన్’కు జాతీయ అధిష్ఠానం అండదండలు, ఆశీస్సులు ఉన్నాయని చెప్పుకోవడం గమనార్హం. గత ఎన్నికల్లో మెజార్టీ రాకపోయినా, అత్యధిక స్థానాలు గెలుచుకున్న కమలం పార్టీ ఆపరేషన్ లోటస్ వ్యూహంతోనే కాంగ్రెస్-జేడీ(ఎస్) ప్రభుత్వాన్ని కొన్ని నెలలకే పడగొట్టి అధికారాన్ని సొంతం చేసుకుంది. ఈసారి ఎన్నికల్లో కూడా అదే వ్యూహాన్ని అమలు చేయాలని పన్నాగం పన్నుతున్నది. ప్రజాతీర్పును శిరసావహించకుండా ఎమ్మెల్యేల కొనుగోళ్లకు బీజేపీ తెరతీయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది రాజకీయ దిగజారుడుతనమని, తెలంగాణలో కర్రు కాల్చి వాతపెట్టినా ఆ పార్టీ కుటిల రాజకీయాలు మానడం లేదని బుద్ధిజీవులు మండిపడుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రంలోని 224 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఈ నెల 10న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. 73.19 శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 36 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్లను లెక్కిస్తున్నారు. మొదట ఇంటి వద్ద నుంచి వేసిన ఓట్లను, పోస్టల్ బ్యాలెట్లను కౌంట్ చేయనున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ అయిన 113 సీట్లు సాధించాల్సి ఉంటుంది.
శాసన సభ ఎన్నికల కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 36 కేంద్రాల్లో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా కౌంటింగ్ కేంద్రాల దగ్గర పటిష్ఠమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం ఒంటి గంటలోపు ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.