బెంగళూరు: వంట విషయంలో అత్తతో గొడవ జరిగింది. తనను వంట చేయనీయడం లేదని మనస్తాపం చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడింది. అత్తింటి వారు తమ కుమార్తెను వరకట్నం కోసం వేధిస్తున్నట్లు ఆమె కుటుంబం ఫిర్యాదు చేసింది. (techie dies by suicide) కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. 35 ఏళ్ల సుష్మ గతంలో అమెరికాలోని ప్రముఖ టెక్ కంపెనీలో పనిచేసింది. ఐదేళ్ల కిందట బెంగళూరుకు చెందిన పునీత్ కుమార్తో ఆమెకు పెళ్లి జరిగింది. ఈ దంపతులకు నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు.
కాగా, సుష్మ, ఆమె అత్త మధ్య చిన్న చిన్న విషయాలకే తరచుగా గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం వంట చేయడంపై వారిద్దరి మధ్య వివాదం జరిగింది. సుష్మ వంట చేయడాన్ని ఆమె అత్త అనుమతించలేదు. ఈ నేపథ్యంలో అత్త వారింట్లో వేధింపులు తాళలేక సుష్మ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
మరోవైపు చిన్న చిన్న విషయాలకే గొడవలతోపాటు వరకట్నం కోసం తమ కుమార్తెను అత్తింటి వారు వేధించినట్లు సుష్మ కుటుంబం ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో భర్త పునీత్ కుమార్ను పోలీసులు అరెస్టు చేశారు. అత్త కల్పన ఆచూకీని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. సుష్మ ఆత్మహత్యపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Bengaluru techie dies by suicide | వివాహం విఫలమవుతుందన్న జ్యోతిష్కుడు.. టెకీ ఆత్మహత్య
Couple’s Marriage Lasted Few Hours | పెళ్లైన కొన్ని గంటల్లోనే విడిపోయిన జంట.. ఎందుకంటే?
Watch: బావిలో పడిన మేక పిల్ల.. కాపాడేందుకు సాహసం చేసిన బాలుడు