Mumbai | ముంబై (Mumbai)లో జరిగిన రోడ్డు (Road Accident) ప్రమాదంలో ఓ టెక్ కంపెనీ సీఈవో (Tech firm CEO) ప్రాణాలు కల్పోయింది. వర్లి (Worli) ప్రాంతంలో ఆదివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
దాదర్-మాతుంగా ప్రాంతంలో నివాసం ఉండే రాజలక్ష్మి రామకృష్ణన్ (Rajalaxmi Ram Krishnan) (42) ఓ టెక్ కంపెనీకి సీఈవో. ఆమెకు రోజూ ఉదయం జాగింగ్ చేయడం అలవాటు. తనను తాను ఒక ఫిట్నెస్ ఫ్రీక్ అని చెప్పుకునే రాజలక్ష్మి.. రోజూలాగే ఆదివారం ఉదయం మార్నింగ్ వాక్కు వెళ్లింది. ఆ సమయంలో అతివేగంగా వచ్చిన టాటా నెక్సాన్ ఈవీ కారు ఆమెను వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రాజలక్ష్మి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని పరీక్షించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కారు డ్రైవర్ 23 ఏళ్ల సుమెర్ మర్చంట్గా గుర్తించి అతడిని అరెస్ట్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ముంబై పోలీసులు తెలిపారు.
Also Read..
Mamata Banerjee | మోదీకి రాహుల్ గాంధీ ‘అతిపెద్ద టీఆర్పీ’ : మమతా బెనర్జీ
India Corona | దేశంలో మళ్లీ పెరుగుతున్న కొవిడ్ కేసులు.. గత 24 గంటల్లో ఎన్ని కేసులంటే..?
Salman Khan | సల్మాన్ను చంపేస్తామంటూ బెదిరింపులు.. నటుడి ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం
Aishwaryaa Rajinikanth | ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో చోరీ.. లాకర్లోని బంగారు, వజ్రాభరణాలు మాయం