భోపాల్: మధ్యప్రదేశ్లో రోజురోజుకు కరోనా కేసులు అధికమవుతున్నాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. రాజధాని భోపాల్ సహా ఆరు నగరాల్లో ఇప్పటికే వారాంతాల్లో లాక్డౌన్ విధిస్తున్నది. తాజాగా ఆదివారం లాక్డౌన్ను మరో ఐదు నగరాల్లో అమలుచేయాలని నిర్ణయించింది.
దీంతో విదిషా, ఉజ్జయిన్, గ్వాలియర్, నర్సింగ్పూర్, సౌన్సార్లో ఈ ఆదివారం లాక్డౌన్ విధించనున్నారు. కరోనా కేసులు భారీగా నమోదవుతుండటంతో ఇండోర్, భోపాల్, జబల్పూర్, బెతూల్, చింద్వారా, రత్లామ్, ఖర్గోన్లో వారాంతాల్లో లాక్డౌన్ అమల్లో ఉన్నది.
రాష్ట్రంలో నిన్న 2091 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,84,265కు చేరింది. ఇందులో 3937 మంది మరణించారు. ఇండోర్లో నిన్న 612 కరోనా కేసులు, భోపాల్లో 425, జబల్పూర్ 156 చొప్పున పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
పుణెలో భారీ అగ్నిప్రమాదం.. 448 షాపులు బుగ్గిపాలు
రేపు, ఎల్లుండి మద్యం దుకాణాలు బంద్
బెంగాల్, అసోంలో ప్రారంభమైన పోలింగ్
నగ్నంగా చాటింగ్.. ఆపై బ్లాక్మెయిల్