పుణె: మహారాష్ట్రలోని పుణెలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పుణెలోని ఫ్యాషన్ స్ట్రీట్ మార్కెట్లో నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత మంటలు అంటుకున్నాయి. దీంతో మార్కెట్ మొత్తం అగ్నికి ఆహుతయ్యింది. మంటలు పక్కనే ఉన్న షాపులకు వ్యాపించడంతో సుమారు 448 దుకాణాలు బుగ్గిపాలయ్యాయి.
పుణెలోని ఎంజీ రోడ్లో ఫ్యాషన్ స్ట్రీట్ ఉన్నది. అక్కడ ఉన్న చిన్నచిన్న దుకాణాల్లో బట్టలు, షూస్, గాగుల్స్, ఇతర యాక్సెసరీల అమ్మకాలు జరుగుతాయి. రాత్రి 9.30 గంటల సమయంలో అగ్నిప్రమాదానికి సంబంధించిన సమాచారం అందింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నామని చీఫ్ ఫైర్ఫైంటింగ్ ఆఫీసర్ ప్రశాంత్ రాన్పైస్ వెల్లడించారు. తక్కువ సమయంలోనే పక్కనే ఉన్న షాపులకు మంటలు వ్యాపించాయి. దీంతో 16 ఫైర్ఇంజన్లతో రాత్రి 1 గంటల వరకు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
గత 15 రోజుల్లో పుణెలో ఇది రెండో అగ్నిప్రమాదం. మార్చి 16న పట్టణంలోని శివాజీ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఇందులో సుమారు 25 దుకాణాలు దగ్ధమయ్యాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేశారా? ఇలా చేసుకోండి
బెంగాల్, అసోంలో ప్రారంభమైన పోలింగ్
రేపు, ఎల్లుండి మద్యం దుకాణాలు బంద్
పాత బస్తీలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం