Bindeshwar Pathak | సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు (Sulabh International founder), స్వచ్ఛ రైలు మిషన్ బ్రాండ్ అంబాసిడర్ బిందేశ్వర్ పాఠక్ (Bindeshwar Pathak) కన్నుమూశారు. 77వ స్వాతంత్య్ర దినోత్సవం (Independence Day) సందర్భంగా సులభ్ ఇంటర్నేషనల్ సెంట్రల్లో ఈ ఉదయం జెండా ఎగురవేసిన ఆయన.. ఆ తర్వాత అస్వస్థకు గురయ్యారు. వెంటనే ఆయన్ని ఢిల్లీ ఎయిమ్స్ (Delhi AIIMS)కు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
బిందేశ్వర్ 1970లో సులభ్ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ను స్థాపించారు. భారతదేశంలో బహిరంగ మలవిసర్జనకు వ్యతిరేకంగా పోరాడిన ఆయన.. కమ్యూనిటీ పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణానికి కృషి చేశారు. అప్పటి కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు ఆధ్వర్యంలో రైలు ప్రాంగణంలో పరిశుభ్రతను పెంపొందించే లక్ష్యంతో.. 2016లో బిందేశ్వర్ స్వచ్ఛ రైలు మిషన్కు బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యారు.
Also Read..
Manipur | 20 ఏళ్ల తర్వాత.. మణిపూర్లో హిందీ చిత్రం బహిరంగ ప్రదర్శన
Rishabh Pant | అభిమానులకు గుడ్ న్యూస్.. రీఎంట్రీకి సిద్ధమైన పంత్..!