రాంచీ: చెప్పులు వేసుకుని స్కూల్కు వచ్చిన విద్యార్థిని చెంపపై ప్రిన్సిపాల్ కొట్టింది. నాటి నుంచి మానసికంగా కుంగిపోయిన ఆ బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. (Slapped By Principal, Student Dies) దీంతో విద్యార్థిని కుటుంబం, గ్రామస్తులు రోడ్డును దిగ్బంధించి ఆమె మృతదేహంతో నిరసన తెలిపారు. జార్ఖండ్లోని గర్హ్వా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బార్గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని స్కూల్లో దివ్య కుమారి 12వ తరగతి చదువుతున్నది. సెప్టెంబర్ 15న ఆ విద్యార్థిని బూట్లకు బదులుగా చెప్పులు ధరించి స్కూలుకు వచ్చింది. అసెంబ్లీకి అలాగే హాజరైంది.
కాగా, డ్రెస్ కోడ్ పాటించని విద్యార్థిని దివ్య కుమారిని, ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ ద్రౌపది మింజ్ అందరి ముందు తిట్టింది. అంతేగాక ఆమె చెంపపై కొట్టింది. ఈ సంఘటన తర్వాత విద్యార్థిని దివ్య తొలుత బాగానే కనిపించింది. ఆ తర్వాత ఆమె నిరాశకు గురైంది. దీంతో కుటుంబ సభ్యులు డాల్టన్గంజ్లోని ఆసుపత్రిలో దివ్యకు ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత రాంచీలోని రిమ్స్కు ఆమెను రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతున్న దివ్య అక్టోబర్ 14న మరణించింది.
మరోవైపు విద్యార్థిని దివ్య మరణానికి స్కూల్ ప్రిన్సిపాల్ మానసిక వేధింపులు కారణమని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అలాగే గ్రామస్తులతో కలిసి తెహ్రీ భండారియా చౌక్ వద్ద ప్రధాన రహదారిని దిగ్బంధించారు. దీంతో వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు, జిల్లా అధికారులు అక్కడకు చేరుకున్నారు. దివ్య కుటుంబాన్ని సముదాయించారు. రోడ్డు దిగ్బంధాన్ని విరమించాలని కోరారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో విద్యార్థిని మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించారు.
Also Read:
Girl Gang Raped By 9 | 14 ఏళ్ల బాలికపై 9 మంది సామూహిక అత్యాచారం.. ఐదుగురు అరెస్ట్
Watch: రైల్వే ట్రాక్ దాటుతుండగా బైక్ పైనుంచి పడిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?