ఢిల్లీ : రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వద్ద ప్రస్తుతం 1.84 కొవిడ్ వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయిని వీటికి తోడు మరో మూడు రోజుల్లో 51 లక్షల కొవిడ్ వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలు అందుకోనున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదివారం తెలిపింది. కేంద్రం ఇప్పటివరకు 20 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులను (20,28,09,250) రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఉచితంగా అందించినట్లు పేర్కొంది.
వీటిలో నిరుపయోగమైన వాటితో సహా మే 14వ తేదీ వరకు సగటున మొత్తం వినియోగం 18,43,67,772 డోసులుగా ఉందంది. ఇంకా 1.84 కొవిడ్ వ్యాక్సిన్ డోసులు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వద్ద ఉన్నాయంది. వీటికి తోడు రాబోయే మూడు రోజుల్లో 50,95,640 వ్యాక్సిన్ డోసులను అందుకుంటాయని తెలిపింది.
రాష్ట్రాలు, యూటీలకు కొవిడ్ వ్యాక్సిన్లను ఉచితంగా అందించడం ద్వారా దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ డ్రైవ్కు కేంద్రం సహకరిస్తోంది. వ్యాక్సిన్ ఉత్పత్తి, సరఫరాను పెంచడానికి అనేక ప్రయత్నాలు చేపట్టినట్లు మంత్రిత్వశాఖ వెల్లడించింది. సెంట్రల్ డ్రగ్స్ లాబొరేటరీ (సీడీఎల్) క్లియర్ చేసిన వ్యాక్సిన్ మోతాదులో ప్రతి నెలా 50 శాతాన్ని కేంద్రం కొనుగోలు చేస్తుంది. ఇంతకుకిత్రమే చెప్పినట్లుగా ఈ వ్యాక్సిన్ డోసులను రాష్ట్ర ప్రభుత్వాలకు ఉచితంగా అందుబాటులో ఉంచడం కొనసాగుతుందని తెలిపింది.