అహ్మదాబాద్: గుజరాత్లోని పోర్బందర్ నుంచి సొమాలియా వెళ్లే నౌకలో మంటలు చెలరేగాయి. (Ship Catches Fire) సుభాష్ నగర్ జెట్టీ వద్ద లంగరు వేసిన కార్గో షిప్లో సోమవారం ఉదయం మంటలు వ్యాపించాయి. దీంతో మూడు అగ్నిమాపక వాహనాలు అక్కడకు చేరుకున్నాయి. నౌకలో చెలరేగిన మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నించారు.
కాగా, జామ్నగర్లోని హెచ్ఆర్ఎం అండ్ సన్స్ కంపెనీకి చెందిన ఈ నౌకలో బియ్యం బస్తాలు లోడ్ చేశారు. ఈ బస్తాలకు మంటలు వ్యాపించడంతో తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ కార్గో షిప్ను సముద్రంలోకి లాక్కెళ్లారు.
మరోవైపు బియ్యం లోడ్ ఉన్న ఆ నౌక సొమాలియాలోని బొసాసోకు వెళ్లాల్సి ఉన్నదని అధికారులు తెలిపారు. అందులో మంటలు చెలరేగిన సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మరోవైపు ఆ నౌక నుంచి మంటలు ఎగసిపడుతున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#WATCH | Gujarat | A ship anchored at Porbandar Subhashnagar Jetty caught fire.
The ship, which belongs to Jamnagar-based HRM & Sons, loaded with rice and sugar, caught fire, and three fire brigade vehicles arrived at the scene. The ship was towed to the middle of the sea as the… pic.twitter.com/30qIN02cv7
— ANI (@ANI) September 22, 2025
Also Read:
Woman Dies By Suicide | హత్యకు గురైన ప్రియుడు.. ప్రియురాలు ఆత్మహత్య
Girl Gang-Raped | బాలికపై సామూహిక అత్యాచారం.. నలుగురు అరెస్ట్
Watch: గర్బా నృత్యం ప్రాక్టీస్ చేస్తున్న మహిళను కిడ్నాప్.. తర్వాత ఏం జరిగిందంటే?