శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ సైనికుడు మృతిచెందగా, మరో జవాన్ గాయపడ్డాడు. షోపియాన్ జిల్లాలోని వాంగమ్లో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. ఈ సందర్భంగా టెర్రరిస్టులు కాల్పులు ప్రారంభించారు. దీంతో సైనికులు ఎదురుకాల్పులు జరపడంతో ఇద్దరు గుర్తుతెలియని ముష్కరులు చనిపోయారని కశ్మీర్ పోలీసులు ప్రకటించారు. కాగా, టెర్రరిస్టుల చేతిలో ఓ సైనికుడు నేలకొరిగాడని, మరో జవాన్కు గాయాలయ్యాయని తెలిపారు. ఆ జవాన్ను దవాఖానకు తరలించామని వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఎయిర్ ఇండియాలో వంద శాతం పెట్టుబడులు వెనక్కి: హర్దీప్ సింగ్
ఏప్రిల్ 1 నుంచి అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ షురూ!
చైనా సరిహద్దులో భారత జవాన్ల డ్యాన్స్.. వీడియో వైరల్
నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి
‘లవ్ స్టోరీ’లో సున్నితమైన పాయింట్..!
మీలో రక్తహీనత ఉందని తెలిపే లక్షణాలు ఇవే..!