Karnataka | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు (Karnataka Assembly Elections Votes Counting) శనివారం ఉదయం ప్రారంభమైంది. అధికార బీజేపీ (BJP), ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ కొనసాగుతోంది. రెండు పార్టీలు ఇంచుమించు సమాన స్థానాలతో ముందంజలో ఉన్నాయి. దీంతో ఏ పార్టీ గెలుస్తుందో అన్న ఉత్కంఠ కర్ణాటక ప్రజల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా నెలకొంది.
ఈ నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి బసరవాజు బొమ్మై (Basavaraj Bommai ) వరుసగా నాలుగోసారి ఎన్నికల బరిలోకి దిగిన షిగ్గావ్ నియోజకవర్గం (Shiggaon Constituency)లో ఓ విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. నియోజకవర్గంలోని బీజేపీ క్యాంపు కార్యాలయం ( BJP camp office) ప్రాంగణంలోకి ఓ పాము ప్రవేశించింది. దీంతో అక్కడున్న ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. గమనించిన సిబ్బంది పామును పట్టుకుని సమీపంలోని చెట్ల పొదల్లోకి వదిలిపెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
#WATCH A snake which had entered BJP camp office premises in Shiggaon, rescued; building premises secured amid CM's presence pic.twitter.com/1OgyLLs2wt
— ANI (@ANI) May 13, 2023
Also Read..
Priyanka Gandhi: కర్ణాటకలో కౌంటింగ్లో.. హనుమాన్ గుడిలో ప్రియాంకా పూజలు
Thummilla Lift | ఆయకట్టు మురిసేలా.. 386 కోట్లతో తుమ్మిళ్ల పథకంలో మూడు రిజర్వాయర్ల నిర్మాణం
BJP| కర్ణాటకలో బీజేపీకి ఎదురుగాలి.. 8 మంది మంత్రులు వెనుకంజ