జలంధర్ : పంజాబ్ పీసీసీ చీఫ్, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూపై కెప్టెన్ అమరీందర్ సింగ్ (Amarinder Singh) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సిద్ధూతో మన దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని, ఆయనను ముఖ్యమంత్రిగా చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తానని చెప్పారు. నేను ఢిల్లీకి వెళ్లనని, తరచుగా వెళ్లేవాళ్లు అక్కడ పార్టీ హైకమాండ్తో ఏమి చెప్తున్నారో తనకు తెలియదన్నారు. ముఖ్యమంత్రి కావాలనుకుని నాకు వ్యతిరేకంగా మొత్తం వాతావరణాన్ని సృష్టించాడని ఆరోపించారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. నవజ్యోత్ సింగ్ సిద్ధూ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోవడానికే ఆయనను టార్గెట్గా చేసుకుని వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తున్నదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
‘నవజ్యోత్ సింగ్ సిద్ధూని ముఖ్యమంత్రిగా చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాను. పాకిస్థాన్తో ఆయనకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయో నాకు తెలుసు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ బజ్వా, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అతడికి స్నేహితులు. ఆయనను ముఖ్యమంత్రిగా చేస్తే మన దేశ భద్రతకు ముప్పు వాటిల్లడం గ్యారంటీ. సిద్దూ ముఖ్యమంత్రి పదవికి సమర్థుడు కాదు’ అని అమరీందర్ సింగ్ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో పార్టీ హైకమాండ్పై కూడా కెప్టెన్ విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యేల సమావేశాన్ని పదేపదే పిలువడం ద్వారా కాంగ్రెస్ హైకమాండ్ నన్ను విశ్వసించలేదని స్పష్టమైందని అన్నారు. పార్టీ నాయకత్వం నన్ను అవమానించిందని, సోనియా గాంధీతో మాట్లాడిన తర్వాతనే రాజీనామా చేశానని తెలిపారు.
ఎన్నికల బరిలో 49 మంది భారత సంతతి వ్యక్తులు
రానున్న రోజుల్లో ఆఫ్ఘన్గా మారనున్న కేరళ : కేజే ఆల్ఫోన్స్
టెస్లాకు పోటీగా రంగంలోకి లూసిడ్ కారు
ప్రధానికి మహిళా క్రీడాకారులు ఇచ్చిన బహుమతులు వేలానికి..
కండ్లు మసకబారుతున్నాయా? అయితే ఈ వ్యాధి కావచ్చు..!
మోదీకి ప్రత్యామ్నాయం మమతయే.. రాహుల్ కాదు
ఆ దాడి నిజంగా తప్పిదమే.. క్షమాపణలు చెప్పిన యూఎస్ ఆర్మీ
మళ్లీ ఏకమవుతున్న బీజేపీ-శివసేన!
మర్చిపోలేని ఉరి ఘటనకు ఐదేండ్లు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..