న్యూఢిల్లీ : బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి కేజే ఆల్ఫోన్స్ (KJ Alphons) .. కేరళపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రానున్న రోజుల్లో కేరళ మొత్తం తాలిబనైజేషన్ అవుతుందని హెచ్చరించారు. 5-10 ఏండ్లలో కేరళ మరో ఆఫ్ఘనిస్తాన్లా మారడం ఖాయమన్నారు.
కేరళలో తీవ్రవాదం పెరిగిపోనున్నదని బీజేపీ ఎంపీ కేజే ఆల్ఫోన్స్ హెచ్చరించారు. కేరళలోని యూడీఎఫ్, ఎల్డీఎఫ్లు రెండూ కలిసి తీవ్రవాదం పెరిగిపోయేలా చేస్తున్నాయని ఆరోపించారు. రాబోయే ఐదు నుంచి పది సంవత్సరాల్లో కేరళ రాష్ట్రం మరో ఆఫ్ఘనిస్తాన్లా మారుతుందని జోస్యం చెప్పారు. కేరళలో తాలిబనైజేషన్ జరుగుతున్నదని, ముఖ్యంగా గత 25 ఏండ్లలో కేరళలోని కొన్ని సంస్థలు తీవ్రవాదులకు అండగా నిలిచాయని తెలిపారు.
జిహాదీ కార్యకలాపాలను అరికట్టేందుకు కేంద్రం జోక్యం కోరుతూ కేరళ బీజేపీ జనరల్ సెక్రటరీ జార్జ్ కురియన్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాసిన నేపథ్యంలో అల్ఫోన్స్ ఈ ప్రకటన చేశారు. వివిధ రకాల జిహాద్లకు సంబంధించి పాల రోమన్ కాథలిక్ బిషప్ మార్ జోసెఫ్ కల్లారాంగార్ట్ చేసిన ఆరోపణలను అమిత్ షా దృష్టికి తీసుకొచ్చేందుకు జార్జ్ కురియన్ లేఖ రాశారు.
టెస్లాకు పోటీగా రంగంలోకి లూసిడ్ కారు
ప్రధానికి మహిళా క్రీడాకారులు ఇచ్చిన బహుమతులు వేలానికి..
కండ్లు మసకబారుతున్నాయా? అయితే ఈ వ్యాధి కావచ్చు..!
మోదీకి ప్రత్యామ్నాయం మమతయే.. రాహుల్ కాదు
ఆ దాడి నిజంగా తప్పిదమే.. క్షమాపణలు చెప్పిన యూఎస్ ఆర్మీ
మళ్లీ ఏకమవుతున్న బీజేపీ-శివసేన!
మర్చిపోలేని ఉరి ఘటనకు ఐదేండ్లు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..