Shashi Tharoor | దేశ రాజధానిలో వాయు కాలుష్యం (Air Pollution) ప్రమాదకరస్థాయిలో ఉన్న విషయం తెలిసిందే. గాలి నాణ్యత సూచీ ఏకంగా 500 మార్క్ను దాటినట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వాయు కాలుష్యానికి తోడు రాజధాని నగరాన్ని దట్టమైన పొగమంచు కమ్మేయడంతో పరిస్థితి అధ్వానస్థాయికి చేరింది. వాయు కాలుష్యం కారణంగా ప్రజలు తీవ్ర అనారోగ్య పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రాజధానిలో గాలి కాలుష్యంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ (Shashi Tharoor ) స్పందించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీని రాజధాని నగరంగా కొనసాగించాలా..? అంటూ ప్రశ్నించారు.
దిల్లీ ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరంగా నిలిచిందని థరూర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇక్కడ ప్రమాదకర కాలుష్య కారకాలు నాలుగు రెట్లు పెరిగినట్లు చెప్పారు. అత్యంత కాలుష్య నగరాల్లో రెండో స్థానంలో ఉన్న బంగ్లాదేశ్ రాజధాని ఢాకాతో పోలిస్తే.. ఢిల్లీలో ప్రమాదకర స్థాయి ఐదు రెట్లు అధికంగా ఉందన్నారు. రాజధానిలో గత కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా.. కేంద్రం మాత్రం పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. నవంబర్ నుంచి జనవరి వరకూ ఈ నగరం నివాసానికి అనుకూలంగా ఉండడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మిగతా కాలంలోనూ ఇక్కడ జీవనం సాగించడం అంతంతమాత్రమేనన్నారు. ఇలాంటి పరిణామాల మధ్య ఢిల్లీని దేశ రాజధానిగా కొనసాగించాలా..? అంటూ శశిథరూర్ ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్గా మారింది.
Delhi is officially the most polluted city in the world, 4x Hazardous levels and nearly five times as bad as the second most polluted city, Dhaka. It is unconscionable that our government has been witnessing this nightmare for years and does nothing about it. I have run an Air… pic.twitter.com/sLZhfeo722
— Shashi Tharoor (@ShashiTharoor) November 18, 2024
500 మార్క్ను తాకిన గాలి నాణ్యత సూచి..
ఢిల్లీలో వాయుకాలుష్యం (Air Pollution) ప్రమాదకరస్థాయికి చేరింది. తాజాగా ఢిల్లీ – ఎన్సీఆర్లో గాలి నాణ్యత సూచి 500 మార్క్కు చేరింది. మంగళవారం ఉదయం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (Air Quality Index) 494గా నమోదైంది. ఈ సీజన్లో ఇదే అత్యధికం. కాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంతో ప్రజలు కళ్ల మంటలు, దురద, గొంతు నొప్పితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రాజధాని ప్రాంతమంతటా గాలి నాణ్యత క్షీణించింది. నగరాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో కాలుష్యం పెరిగింది. మంగళవారం ఉదయం పలు ఎయిర్ మానిటరింగ్ స్టేషన్లలో ఏక్యూఐ లెవల్స్ 500 మార్క్ను తాకాయి. ఇది సివియర్ ప్లస్ కేటగిరీని సూచిస్తుంది. ద్వారకలో అత్యల్పంగా 480గా నమోదైంది. సోమవారం కూడా ఢిల్లీలో కాలుష్యం ఇదే స్థాయిలో నమోదైన విషయం తెలిసిందే. ఇవాళ వరుసగా రెండో రోజు కూడా దట్టమైన పొగమంచు కారణంగా భారత వాతావరణ శాఖ (IMD) ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
Also Read..
Indira Gandhi | ఇందిరా గాంధీ జయంతి.. శక్తి స్థల్ వద్ద కాంగ్రెస్ నేతల నివాళి
Air Pollution | 500 మార్క్ను తాకిన గాలి నాణ్యత సూచి.. ఈ సీజన్లో ఇదే అత్యధికం
Russia-Ukraine War | రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి వెయ్యి రోజులు..