Waqf (Amendment) Bill, 2024 : వక్ఫ్ బిల్లుపై శివసేన (UBT) తన వైఖరి స్పష్టం చేయాలని మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన నేత సంజయ్ నిరుపమ్ డిమాండ్ చేశారు. లోక్సభలో గురువారం వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టగా పలువురు విపక్ష ఇండియా నేతలు వ్యతిరేకించారని అన్నారు. శివసేన (UBT)కి చెందిన 9 మంది ఎంపీలు ఓటింగ్కు దూరంగా ఉన్నారని, మీరు ముస్లిం ఓట్ల కోసమే ఓటింగ్కు దూరంగా ఉన్నారా అని సంజయ్ నిరుపమ్ ప్రశ్నించారు.
అసలు శివసేన యూబీటీ వక్ఫ్ బిల్లును కోరుకుంటోందా లేదా అనేది స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక, అంతకుముందు విపక్షాలు వక్ఫ్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని టీఎంసీ ఎంపీ శత్రుఘ్న సిన్హా స్పష్టం చేశారు. మతం ఆధారంగా చీలిక తీసుకొచ్చే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ బిల్లును ముందుకు తెచ్చిందని విపక్ష ఇండియా కూటమి భావిస్తోందని పేర్కొన్నారు. శత్రుఘ్న సిన్హా శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ వక్ఫ్ బిల్లు ఓ మతం లక్ష్యంగా తీసుకొచ్చారని మండిపడ్డారు.
విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో వెనక్కి తగ్గిన మోదీ సర్కార్ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC)కి నివేదించిందని అన్నారు. కాగా, అంతకుముందు వక్ఫ్ బిల్లుపై ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరాం) ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్ మోదీ సర్కార్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. అసలు మోదీ ప్రభుత్వం ముస్లింల మేలు కోరే ప్రభుత్వమేనా అనేది మనం ఆలోచించాలని అన్నారు. ముస్లింల ప్రయోజనాల కోసం వారు ఏ చట్టాన్ని అయినా రూపొందించారా అని ప్రశ్నించారు.ముస్లింల మేలు కోసం ఏ ఒక్క పధకమైనా తీసుకొచ్చారా అని నిలదీశారు.
Read More :
Brutal murder | పింఛన్ డబ్బుల కోసం తల్లిని చంపిన తనయుడు