Rahul Gandhi | పరువు నష్టం కేసులో దోషిగా తేలిన కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పై లోక్సభ సెక్రటేరియట్ ఎంపీ (MP)గా అనర్హత ( disqualified ) వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో దేశ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాహుల్పై అనర్హత వేటు వేయడాన్ని ప్రతిపక్షాలు సైతం తప్పుబట్టాయి. బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. కాగా, ఈ అంశంపై తాజాగా అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. భారత కోర్టుల్లో ( Indian courts) రాహుల్ గాంధీ కేసును తాము చూస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ ప్రిన్సిపల్ డిప్యూటీ స్పోక్స్పర్సన్ (US Department of State Principal Deputy Spokesperson) వేదాంత్ పటేల్ (Vedant Patel) తెలిపారు.
అయితే, ప్రజా స్వామ్యి విలువలను బలోపేతం చేసే అంశంలో భారత్తో కలిసి పనిచేసేందుకు కట్టుబడి ఉన్నట్లు వెల్లడించారు. ‘చట్ట నిబంధనలను గౌరవించడం, న్యాయ స్వతంత్రత ఏ ప్రజాస్వామ్యానికైనా మూల స్తంభాలాంటివి. భారత కోర్టుల్లో ( Indian courts) రాహుల్ గాంధీ కేసును మేం చూస్తున్నాం. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛతో పాటు ప్రజాస్వామ్య విలువలపై భారత ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు నిబద్ధతతో ఉన్నాం’ అని ఆయన పేర్కొన్నారు.
Also Read..
Namibia Cheetah Sasha | కూనో నేషనల్ పార్క్లో నమీబియా చిరుత సాషా మృతి
India Corona | కొనసాగుతున్న కరోనా వైరస్ వ్యాప్తి.. 11 వేలకు చేరువలో యాక్టివ్ కేసులు
Bus accident in Saudi Arabia | ఘోర ప్రమాదం.. వంతెనను ఢీ కొట్టిన యాత్రికుల బస్సు.. 20 మంది మృతి