Namibia Cheetah Sasha | ప్రాజెక్ట్ చీతా (Project cheetah) లో భాగంగా నమీబియా (Namibia) నుంచి గతేడాది భారత్ (India)కు తీసుకొచ్చిన ఎనిమిది చీరుతల్లో ఒకటి సోమవారం మృతి చెందింది. సెప్టెంబర్లో నమీబియా నుంచి ఎనిమిది చీతాలను ప్రత్యేక విమానంలో భారత్కు తరలించిన విషయం తెలిసిందే. అనంతరం వాటిని మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని కూనో నేషనల్ పార్క్ (Kuno National Park)లోకి వదిలారు. నిమిదింట్లో.. 5 ఆడ, 3 మగ చిరుతలు ఉన్నాయి.
ఎనిమిదింట్లో ఆడ చీత (female cheetah) సాషా (Sasha) సోమవారం మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. కూనో పార్కులో ఉంటున్న సాషా (Sasha) రోజూవారి పరీక్షల్లో చాలా బలహీనంగా కనిపించేదని అధికారులు వెల్లడించారు. వైద్య పరీక్షలు నిర్వహించగా.. చీతాకు డీహైడ్రేషన్ అవుతోందని అదేవిధంగా కిడ్నీ సంబంధిత (kidney infection) సమస్యలు ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. సాషాను భారత్కు తీసుకురాకముందే అనారోగ్యంతో బాధపడుతోందని అధికారులు వెల్లడించారు. పార్క్లోని ఇతర చిరుతలు ఆరోగ్యంగా ఉన్నాయని తెలిపారు.
Also Read..
Bus accident in Saudi Arabia | ఘోర ప్రమాదం.. వంతెనను ఢీ కొట్టిన యాత్రికుల బస్సు.. 20 మంది మృతి
India Corona | కొనసాగుతున్న కరోనా వైరస్ వ్యాప్తి.. 11 వేలకు చేరువలో యాక్టివ్ కేసులు