Chidambaram | నల్లధనం (Black Money) మార్చుకునే వారికి మోదీ ప్రభుత్వం (Modi Governament) రెడ్ కార్పెట్ (Red Carpet)తో స్వాగతం పలుకుతోందని కేంద్ర ఆర్థిక మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం (P. Chidambaram) అన్నారు. రూ.2,000 నోట్లను నగదు చలామణి నుంచి ఉపసంహరించుకోవడంపై ఆయన స్పందించారు. ఇది మోదీ ప్రభుత్వపు మూర్ఖపు చర్యగా అభివర్ణించారు.
‘2,000 రూపాయల నోట్లను మార్చుకునేందుకు ఎలాంటి గుర్తింపు, ఫారాలు, రుజువులు అవసరం లేదని బ్యాంకులు స్పష్టం చేశాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రూ.2 వేల నోట్లను పెద్ద ఎత్తున దాచుకున్న వారు బ్లాక్ మనీని సులువుగా మార్చుకోవడానికి అవకాశం కల్పించినట్లైంది’ అని అన్నారు.
అంతేకాకుండా సాధారణ ప్రజల వద్ద రూ.2,000 నోట్లు లేవని చిదంబరం అన్నారు. ‘రోజువారీ చిల్లర నగదు మార్పిడికి రూ.2వేల నోట్లు పనికిరావు. అందుకే 2016లో వాటిని ప్రవేశపెట్టినా ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. ప్రస్తుతం రూ.2,000 నోట్లు ఎవరి వద్ద అధికంగా ఉంటాయనేది అందరికీ తెలుసు. నల్ల ధనాన్ని కాపాడుకునేవారికి ఈ నోట్లు బాగా సహాయపడ్డాయి. ఇప్పుడు వారు తమ నోట్లను మార్చుకునేందుకు మోదీ ప్రభుత్వం రెడ్ కార్పెట్తో స్వాగతం పలుకుతోంది. 2016లో రూ.2,000 నోటును ప్రవేశపెట్టడం ఓ మూర్ఖపు చర్య. అయితే ఏడేళ్ల అనంతరం ఆ మూర్ఖపు చర్యను వెనక్కి తీసుకున్నందుకు నేను సంతోషిస్తున్నాను’ అని చిదంబరం ట్వీట్ చేశారు.
Banks have clarified that no identity, no forms and no proof will be required to exchange the Rs 2000 notes
The BJP's spin that the Rs 2000 notes are being withdrawn to unearth black money stands demolished
Ordinary people do not have Rs 2000 notes. They shunned it soon after…
— P. Chidambaram (@PChidambaram_IN) May 22, 2023
Also Read..
Arvind Kejriwal | ఆప్ మేనిఫెస్టోతోనే కర్ణాటకలో కాంగ్రెస్ విజయం : అరవింద్ కేజ్రీవాల్
Virat Kohli | ఐపీఎల్ నుంచి ఆర్సీబీ ఔట్.. కన్నీళ్లు పెట్టుకున్న కోహ్లీ.. పిక్ వైరల్
Earthquake | ఉత్తర కాలిఫోర్నియాలో 5.5 తీవ్రతతో భారీ భూకంపం