Virat Kohli | ఆద్యంతం ఆసక్తిగా సాగుతున్న ఈ ఏడాది ఐపీఎల్ 2023 (IPL 2023)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) కథ ముగిసింది. ఆదివారం సాయంత్రం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమితో ఐపీఎల్ నుంచి నిష్క్రమించింది. రన్మెషీన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) వీరోచిత సెంచరీతో విజృంభించినా.. తన జట్టును ప్లేఆఫ్స్కు చేర్చలేకపోయాడు. దీంతో ఈసారైనా టైటిల్ గెలిచి కప్ అందుకోవాలనుక్ను బెంగళూరు కల నెరవేరలేదు. దీంతో ఆర్సీబీ (RCB) టీమ్తోపాటు అభిమానులు కూడా తీవ్ర నిరాశ చెందుతున్నారు.
మొదట బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. రన్మెషీన్ విరాట్ కోహ్లీ (61 బంతుల్లో 101 నాటౌట్; 13 ఫోర్లు, ఒక సిక్సర్) వరుసగా రెండో మ్యాచ్లో సెంచరీ నమోదు చేశాడు. అయితే భారీ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో బెంగళూరు బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. ఫలితంగా గుజరాత్ 6 వికెట్ల తేడాతో బెంగళూరును చిత్తుచేసింది. ఓటమి అనంతరం విరాట్ కోహ్లీ భావోద్వేగానికి గురయ్యాడు (Virat Kohli Emotional). జట్టు ఓటమి పాలవగానే కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాగా, ఐపీఎల్ సీజన్లో కోహ్లీ అరుదైన రికార్డు అందుకున్నాడు. ఐపీఎల్ 16వ సీజన్లో చివరి లీగ్ మ్యాచ్..ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే గెలవక తప్పని గేమ్లో విరాట్ కోహ్లీ(101 నాటౌట్ : 61బంతుల్లో 13 ఫోర్లు ఒక సిక్స్) శతకంతో మెరిశాడు. వరుసగా రెండో సెంచరీతో ఐపీఎల్లో అత్యధికంగా ఏడు సార్లు వంద కొట్టి విండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్గేల్ రికార్డు బద్ధలు కొట్టాడు. దీంతో ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు బాదిన క్రికెటర్గా కోహ్లీ చరిత్రకెక్కనున్నాడు.
One Tweet from ur side and One RT is Compulsory….! For King Kohli Tears 💔
A TEAM WITH NO HEART 💔 (What is this ?? Go n see my Latest Tweets but now just Follow and Viral this Trend
RCB vs GT#ViratKohli𓃵 #ViratKohli #bengalururain pic.twitter.com/eKUw3ZBeMy— I'm Sanju (@JodPahadi) May 21, 2023
Most painful picture of the IPL.
King Kohli gave his absolute best, scored back to back centuries for RCB, but RCB are knocked out. You gotta feel for Virat! pic.twitter.com/ofzcxPdlHB
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 21, 2023
Also Read..
Earthquake | అరుణాచల్ప్రదేశ్లో 4.5 తీవ్రతతో స్వల్ప భూకంపం
G20 Summit | శ్రీనగర్లో నేటి నుంచి జీ20 సమావేశాలు.. భద్రత కట్టుదిట్టం
Delhi | ఢిల్లీలో ఘోర ప్రమాదం.. బైక్ను ఢీకొట్టిన బీఎండబ్ల్యూ కారు.. వ్యక్తి మృతి