శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్లో (Srinagar) పర్యాటక రంగంపై జీ20 (G20 Summit) వర్కింగ్ గ్రూప్ సమావేశాలు సోమవారం నుంచి జరుగనున్నాయి. నేటి నుంచి మూడు రోజులపాటు ఈ సమావేశాలను నిర్వహిస్తారు. మొత్తం 60 మందికిపైగా విదేశీ ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈనేపథ్యంలో నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. జమ్ముకశ్మీర్కు 370 ఆర్టికల్ (Article 370) రద్దు చేసి రాష్ట్ర హోదాను తొలగించిన తర్వాత అంతర్జాతీయ కార్యక్రమానికి శ్రీనగర్ ఆథిత్యం ఇవ్వడం ఇదే మొదటిసారి. శ్రీనగర్లోని దాల్ సరస్సుతోపాటు సమావేశానికి వేదిక అయిన షేర్-ఏ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్కు వెళ్లే రహదారుల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. పారామిలిటరీ బలగాలు, ఎన్ఎస్జీ కమాండోలు, పోలీసులు మోహరించారు. ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆదీనంలోకి తీసుకున్నారు.
కాగా, భారత్ పట్ల తన వక్రబుద్ధిని చైనా (China) మరోసారి చాటుకున్నది. శ్రీనగర్లో జీ20 సదస్సును నిర్వహించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ సదస్సుకు తాము హాజరుకావడం లేదని ప్రకటించింది. వివాదాస్పద భూభాగంలో (Disputed territory) సమావేశాలు జరపడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని చెప్పింది. కశ్మీర్లో (Kashmir) నిర్వహించే ఇలాంటి భేటీలకు తాము వచ్చేది లేదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ (Wang Wenbin) రెండు రోజుల క్రితం వెల్లడించారు.
Witness one of nature’s finest works, Paradise on Earth! 🌷
Abode of verdant valleys, pristine lakes, striking autumn & a rich cultural heritage, the land of unforgettable majestic beauty – Jammu & Kashmir is hosting the 3⃣rd #TWG Meet in its capital city #Srinagar. #G20India pic.twitter.com/1N55ENRTAM
— G20 India (@g20org) May 21, 2023