ముంబై: ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తెలిపారు. తాను ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసి కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ తనకు ఫోన్ చేశారని, తన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారని పవార్ చెప్పారు. నా ఆరోగ్యంపై ఆయన కనబర్చిన శ్రద్ధకు, ఆయన మంచి మనస్తత్వానికి తాను ఎంతో సంతోషించానని, అందుకు ఆయనను మెచ్చుకున్నానని ఆస్పత్రికి వచ్చిన సన్నిహితుల ముందు శరద్ పవార్ వెల్లడించినట్లు సమాచారం.
కాగా, కడుపులో నొప్పితో స్వల్ప అస్వస్థతకు గురైన శరద్పవార్ను కుటుంబసభ్యులు ఈ ఉదయం ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ అన్ని రకాల పరీక్షలు నిర్వహించిన వైద్యులు సమస్య మూత్రాశయంలో ఉన్నట్లు నిర్ధారించారు. దానికి సంబంధించి ఈ నెల 31న ఎండోస్కోపీ తీసి సర్జరీ చేయనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో అడ్మిట్ కావాల్సిన అవసరం లేదని, 31న వచ్చి అడ్మిట్ అయితే సరిపోతుందని చెప్పారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఆ వృద్ధురాలు మృతి.. బీజేపీ, టీఎంసీ మధ్య మళ్లీ మాటల యుద్ధం
ఊరంతా కప్పేసిన మంచు దుప్పటి..!
శరద్పవార్కు స్వల్ప అస్వస్థత.. బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి తరలింపు
గడ్చిరోలిలో భారీ ఎన్కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు మృతి..!
సుయెజ్ కాలువలో కదిలిన ఎవర్ గివెన్ షిప్
అలస్కాలో కుప్పకూలిన హెలికాప్టర్..
దేశంలో కొత్తగా 68 వేల కరోనా కేసులు
లండన్లో ప్రియాంక చోప్రా హోలీ సంబురాలు
చిన్నారి పెళ్లికూతురు పెళ్లి పీటలెక్కిందా?