ముంబై: జీరో బ్యాలెన్స్ ఖాతాల్లో నాలుగు కంటే అత్యధికంగా జరిపిన లావాదేవీలపై విధించిన చార్జీలను రీఫండ్ చేశామని దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ వాణిజ్య బ్యాంక్.. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) తెలిపింది. పరిమితికి మించిన లావాదేవీలపై సహేతుక ఛార్జీలు వసూలు చేసుకునే వెసులుబాటును 2012 ఆగస్టులో ఆర్బీఐ కల్పించిందని గుర్తు చేసింది.
కనుక బేసిక్ సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్ (బీఎస్బీడీ) ఖాతాదారులు నెలలో నాలుగు ఉచిత లావాదేవీల తర్వాత జరిపే లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేసినట్టు తెలిపింది. 2016 జూన్ 15 నుంచి ఈ ఛార్జీలను వసూలు ప్రక్రియ అమలు చేసినట్లు వెల్లడించింది.
జీరో బ్యాలెన్స్ ఖాతాలతో ఉచిత లావాదేవీలపై చార్జీలను వసూలు చేసే విషయాన్ని బ్యాంకు ఖాతాదారులకు ముందే సమాచారం ఇచ్చామని ఎస్బీఐ వివరించింది. అయితే, 2020 జనవరి 1 తర్వాత డిజిటల్ లావాదేవీలపై విధించిన ఛార్జీలను తిరిగి ఖాతాదారులకు చెల్లించాలంటూ 2020 ఆగస్టులో కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఆదేశాలు జారీ చేసింది.
భవిష్యత్లో బ్యాంకుల ఖాతాదారులు జరిపే డిజిటల్ లావాదేవీలపై ఛార్జీలు విధించరాదని తమకు సీబీడీటీ సూచించిందని ఎస్బీఐ తెలిపింది.
సీబీడీటీ ఇచ్చిన ఆదేశాల మేరకు 2020 జనవరి 1 నుంచి 2020 సెప్టెంబర్ 14 వరకు జీరో బ్యాలెన్స్ ఖాతాదారుల డిజిటల్ లావాదేవీలపై విధించిన ఛార్జీలను రిఫండ్ చేశామన్నది. గతేడాది సెప్టెంబర్ 15 నుంచి అలాంటి ఛార్జీలేమీ వసూలు చేయడం లేదని ఎస్బీఐ స్పష్టంచేసింది.
స్మార్ట్గా దోపిడీ.. రూ.5 లక్షలు చోరీ
బ్యాంక్ అలర్ట్ : ఆదివారం ఆర్టీజీఎస్ సేవలకు బ్రేక్!
ఈనెల 30 వరకు గురుకులసెట్ దరఖాస్తులు
చౌక వడ్డీకే బంగారం లోన్.. ఈ బ్యాంకుల్లోనే..!
వాట్సాప్ లో ఈ తప్పులు అస్సలు చేయొద్దు