జైపూర్: తన కారుకు వెంటనే ఇంధనం నింపనందుకు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం) ఆగ్రహించాడు. పెట్రోల్ బంకు సిబ్బంది చెంపపై కొట్టాడు. (Rajasthan Bureaucrat) ఈ నేపథ్యంలో ఆ అధికారి, పెట్రోల్ బంకు సిబ్బంది మధ్య ఘర్షణ జరిగింది. రాజస్థాన్లోని భిల్వారాలో ఈ సంఘటన జరిగింది. ప్రతాప్గఢ్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం) ఛోటు లాల్ శర్మ, మంగళవారం జస్వంత్పురా ప్రాంతంలోని పెట్రోల్ బంక్కు తన కారులో చేరుకున్నాడు. క్యూలో ఉన్న మిగతా వాహనాల కంటే ముందుగా తన కారుకు ఇంధనం నింపకపోవడంపై ఆయన ఆగ్రహించాడు. ఒక సిబ్బంది వద్దకు వెళ్లి చెంపపై కొట్టాడు. దీంతో పెట్రోల్ బంకు సిబ్బంది ఆయనపై చేయి చేసుకున్నారు.
కాగా, కారులో ఉన్న ఎస్డీఎం భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెట్రోల్ బంకులోని ఒక సిబ్బంది తనను చూసి కన్నుగీటి అసభ్యకరమైన వ్యాఖ్య చేయడంతో ఈ గొడవ జరిగినట్లు ఆరోపించింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, దీపక్ మాలి, ప్రభు లాల్ కుమావత్, రాజా శర్మ అనే ముగ్గురు బంకు సిబ్బందిని అరెస్ట్ చేశారు.
మరోవైపు ఎస్డీఎం తొలుత అకారణంగా పెట్రోల్ బంకు సిబ్బంది చెంపపై కొట్టిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆయన భార్య ఫిర్యాదుతో కేవలం బంకు సిబ్బందిని అరెస్ట్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో పోలీసులు దిగి వచ్చారు. ఇరు వర్గాల ఫిర్యాదులపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
He’s Chhotu Lal Sharma, SDM, Pratapgarh, Rajasthan.
When the petrol pump employees didn’t serve him first, he politely reminded them with, “Oye! SDM hoon main yahan ka. Tereko dikh nahi raha gaadi lagi hai.” The arrogant staff, instead of paying due respect with a salute, argued… pic.twitter.com/n2wgoVyjsw
— THE SKIN DOCTOR (@theskindoctor13) October 22, 2025
Also Read:
Children Lose Eyesight | దీపావళి రోజున ‘కార్బైడ్ గన్’తో ఆడిన పిల్లలు.. కంటి చూపు కోల్పోయిన 14 మంది
Watch: రైలు పట్టాలపై రీల్ చేసిన యువకుడు.. తర్వాత ఏం జరిగిందంటే?