Rahul Gandhi | ‘అంబానీ (Ambani), అదానీ (Adani) నుంచి కాంగ్రెస్కు ఎంత ముట్టింది..?’ అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తాజాగా స్పందించారు. అంబానీ, అదానీలు డబ్బు పంపుతున్నారంటూ వ్యక్తిగత అనుభవంతో మాట్లాడుతున్నారా..? అంటూ మోదీకి రాహుల్ కౌంటర్ ఇచ్చారు.
కాగా, తెలంగాణలోని వేములవాడలో జరిగిన ఎన్నికల సభలో మోదీ మాట్లాడుతూ.. ‘తెలంగాణ గడ్డ నుంచి నేను ఒకటి అడగాలనుకుంటున్నా. గడచిన ఐదేళ్లుగా అదానీ, అంబానీలపై విమర్శలు గుప్పించిన కాంగ్రెస్.. ఎన్నికల ప్రక్రియ మొదలు కాగానే ఎందుకు మౌనం దాల్చిందో స్పష్టం చేయాలి. అదానీ, అంబానీ నుంచి ఎన్ని టెంపో లోడ్ల ధనం ముట్టింది..? ఏం ఒప్పందం కుదిరింది..? రాత్రికి రాత్రే అంబానీ, అదానీలపై ఆరోపణలు ఆగిపోయాయి’ అని ప్రధాని మోదీ ప్రశ్నించారు.
మోదీ వ్యాఖ్యలను రాహుల్ తాజాగా తిప్పికొట్టారు. అంబానీ, అదానీలు డబ్బు పంపుతున్నారంటూ వ్యక్తిగత అనుభవం దృష్ట్యా మాట్లాడుతున్నారా..? అని మోదీని ప్రశ్నించారు. ‘మోదీ జీ.. మీరు భయపడుతున్నారా..? సాధారణంగా మీరు అదానీ, అంబానీల గురించి అంతర్గతంగా మాట్లాడరు. డోర్లు మూసి ఉన్నప్పుడే వారి గురించి ప్రస్తావిస్తారు. కానీ మొదటిసారి మీరు వారి గురించి బహిరంగంగా మాట్లాడారు. వారు టెంపోల నిండా డబ్బులుపంపుతారని మీకు తెలుసు. అది మీ వ్యక్తిగత అనుభవమా..?’ అని రాహుల్ ప్రశ్నించారు.
ఆ ఇద్దరు పారిశ్రామిక వేత్తల వద్దకు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐలను పంపించి వీలైనంత త్వరగా విచారణ జరిపించండి అంటూ రాహుల్ ఎద్దేవా చేశారు. బీజేపీ అవినీతి టెంపోకు డ్రైవర్ ఎవరో, హెల్పర్ ఎవరో దేశం మొత్తానికి తెలుసునన్నారు. ఈ మేరకు 46 సెకన్ల నిడివిగల వీడియోను రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
भाजपा के भ्रष्टाचार के टेम्पो का ‘ड्राइवर’ और ‘खलासी’ कौन है, देश जानता है। pic.twitter.com/62N5IkhHWk
— Rahul Gandhi (@RahulGandhi) May 8, 2024
Also Read..
Kerala Governor | అయోధ్య రాముడి ముందు ప్రణమిల్లిన కేరళ గవర్నర్ ఆరిఫ్ ఖాన్.. VIDEO
Air India Express | క్రూ సిబ్బంది మూకుమ్మడి సెలవులు.. 30 మందిపై సంస్థ వేటు