Kerala Governor | అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరాన్ని కేరళ గవర్నర్ (Kerala Governor) ఆరిఫ్ మహ్మద్ ఖాన్ (Arif Mohammad Khan) సందర్శించారు. ఈ సందర్భంగా గర్భగుడిలో కొలువుదీరిన బాలరాముడిని దర్శించుకున్నారు. రామ్ లల్లా (Ram Lalla) విగ్రహం ముందు మోకాళ్లపై కూర్చొని మొక్కుకున్నారు. అనంతరం నేలపై పడుకొని తలను నేలకు ఆన్చి ప్రణమిల్లారు. ఇందుకు సంబంధించిన వీడియోను కేరళ రాజ్భవన్ కార్యాలయం అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది.
గవర్నర్ ప్రణమిల్లుతున్న సమయంలో వెనుక నుంచి ‘జై శ్రీరామ్.. జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది. ముస్లిం మతానికి చెందిన కేరళ గవర్నర్ అయోధ్య రాములవారిని దర్శించుకోవడం దేశవ్యాప్తంగా ఆసక్తిని కలిగించింది. కాగా, ఆయన అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకోవడం ఇది రెండోసారి కావడం విశేషం.
Hon’ble Governor Shri Arif Mohammed Khan at Prabhu Shri Ram Temple Ayodhya: PRO KeralaRajBhavan pic.twitter.com/wCzZCSirLt
— Kerala Governor (@KeralaGovernor) May 8, 2024
Also Read..
Air India Express | క్రూ సిబ్బంది మూకుమ్మడి సెలవులు.. 30 మందిపై సంస్థ వేటు
Kedarnath Yatra | రేపు తెరుచుకోనున్న కేదార్నాథ్ తలుపులు.. 40 క్వింటాళ్ల పూలతో ఆలయం ముస్తాబు