జై జవాన్.. జై కిసాన్ను జవాన్ వర్సెస్ కిసాన్ చేశారు!

న్యూఢిల్లీ: మన నినాదం జై జవాన్, జై కిసాన్.. కానీ దానిని జవాన్ వర్సెస్ కిసాన్ చేసేశారు అంటూ ప్రధాని నరేంద్ర మోదీపై మండిపడ్డారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఢిల్లీలో రైతుల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించిన ఫొటోలను రాహుల్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఓ జవాను ఆందోళన చేస్తున్న రైతుపైకి లాఠీ ఎత్తిన ఫొటోను షేర్ చేస్తూ.. ఇది చాలా బాధాకరమైన ఫొటో అని ట్వీట్ చేశారు. మన నినాదం జై జవాన్ జై కిసాన్.. కానీ ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ అహంకారం దానిని జవాన్ వర్సెస్ కిసాన్గా మార్చేసింది. ఇది చాలా ప్రమాదకరం అని రాహుల్ ఆ ట్వీట్లో ఆందోళన వ్యక్తం చేశారు.
बड़ी ही दुखद फ़ोटो है। हमारा नारा तो ‘जय जवान जय किसान’ का था लेकिन आज PM मोदी के अहंकार ने जवान को किसान के ख़िलाफ़ खड़ा कर दिया।
— Rahul Gandhi (@RahulGandhi) November 28, 2020
यह बहुत ख़तरनाक है। pic.twitter.com/1pArTEECsU
అటు రైతుల ఆందోళనకు ప్రియాంకా గాంధీ కూడా మద్దతు తెలిపారు. వాళ్లను అడ్డుకుంటున్న బీజేపీ సర్కార్పై మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వంలో దేశం పరిస్థితి ఎలా మారిపోయిందో చూడండి. బీజేపీ స్నేహితులైన కోటీశ్వరులు ఢిల్లీ వస్తే వారికి రెడ్ కార్పెట్ పరుస్తారు. కానీ రైతులు వస్తుంటే మాత్రం అడ్డుకుంటారు. మీరు రైతు వ్యతిరేక చట్టాలను చేస్తే తప్పు లేదు కానీ.. రైతులు ఢిల్లీకి వస్తే మాత్రం తప్పా అని ప్రియాంకా గాంధీ ట్వీట్ చేశారు.
भाजपा सरकार में देश की व्यवस्था को देखिए
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) November 28, 2020
जब भाजपा के खरबपति मित्र दिल्ली आते हैं तो उनके लिए लाल कालीन डाली जाती है।
मगर किसानों के लिए दिल्ली आने के रास्ते खोदे जा रहे हैं।
दिल्ली किसानों के खिलाफ कानून बनाए वह ठीक, मगर सरकार को अपनी बात सुनाने किसान दिल्ली आए तो वह गलत? pic.twitter.com/rm7CFmaWAL
తాజావార్తలు
- ట్రాక్టర్ ర్యాలీ అంతరాయానికి పాక్ ట్విట్టర్ ఖాతాల కుట్ర!
- 100 మంది మెరిట్ విద్యార్థులకు పరేడ్ చాన్స్!
- కంగన సంచలనం: ఆ డ్రెస్ కొనేందుకు డబ్బుల్లేవంట!
- లాలూ త్వరగా కోలుకోవాలి: నితీశ్ ఆకాంక్ష
- కార్గిల్లో అడ్వెంచర్ టూరిజం ప్రారంభం
- రూబీ గోల్డ్ యజమాని ఇఫ్సర్ రెహమాన్ అరెస్టు
- ఢిల్లీ వరకు రివర్స్లో ట్రాక్టర్ నడిపిన రైతు
- సుంకాలు మోయలేం.. జీఎస్టీ తగ్గించండి: ఫోన్ ఇండస్ట్రీ వేడికోళ్లు
- రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
- కూతుళ్లను డంబెల్తో కొట్టి చంపిన తల్లి