బెంగళూరు: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) బస్సులో ప్రయాణించారు. విద్యార్థులు, మహిళలతో ఆయన మాట్లాడారు. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సోమవారంతో ముగిసింది. అయితే ప్రచారంలో బిజీ అయిన రాహుల్ గాంధీ చివరి రోజున బెంగళూరులో ఉల్లాసంగా గడిపారు. సోమవారం ఉదయం కన్నింగ్హామ్ రోడ్లోని ‘కేఫ్ కాఫీ డే’లో కాఫీ తాగారు. ఆ తర్వాత బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ) బస్టాప్కు చేరుకున్నారు. అక్కడ కాలేజీ విద్యార్థులు, మహిళా ఉద్యోగులతోమాట్లాడారు. అనంతరం రాహుల్ గాంధీ ఒక బస్సు ఎక్కి అందులో ప్రయాణించారు. మహిళా ప్రయాణికులతో సంభాషించారు.
కాగా, రాహుల్ గాంధీ బస్సులో ఎక్కడకు వెళ్తున్నారని కొందరు మహిళలు ఆయనను అడిగారు. వారికి నమస్కారం చేసిన ఆయన వారి బాగోగులను ఆరా తీశారు. అలాగే ప్రయాణాల సందర్భంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టికెట్ ధరల పెంపు గురించి కొందరు మహిళలు ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం గురించి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్నట్లు రాహుల్ గాంధీ తెలిపారు. ఇది మంచి ఆలోచనే కదా? అని వారిని ప్రశ్నించారు. లింగరాజపురం స్టేజ్ వద్ద ఆయన బస్సు దిగారు. ఆ తర్వాత చివరి రోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
మరోవైపు దీనికి సంబంధించిన ఒక వీడియో క్లిప్ను ట్విట్టర్లో రాహుల్ గాంధీ పోస్ట్ చేశారు. ‘బెంగళూరు అనుభవాన్ని అత్యుత్తమంగా ఆస్వాదించా. కర్ణాటకలోని కొంత మంది అద్భుతమైన మహిళలతో కలిసి బస్సులో ప్రయాణం. కాంగ్రెస్ పార్టీ 5 హామీలతో వారి జీవితాలను మంచిగా మార్చడానికి మేం కట్టుబడి ఉన్నాం’ అని అందులో పేర్కొన్నారు. కాగా, కర్ణాటకలో ఈ నెల 10న పోలింగ్ జరుగనున్నది. ఈ నెల 13న ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.
Enjoyed a quintessential Bengaluru experience – a BMTC Bus ride with some incredible women of Karnataka.
We are committed to change their lives for the better with the 5 Congress Guarantees. pic.twitter.com/SwFCiFoqxS
— Rahul Gandhi (@RahulGandhi) May 8, 2023