Loksabha Elections 2024 : ఈసారి 400కిపైగా స్ధానాలు గెలుచుకుంటామనే నినాదాలతో కాషాయ పార్టీ హోరెత్తిస్తోందని బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. 400 స్ధానాలు దాటతామని బీజేపీ గొప్పలు చెబుతుంటే క్షేత్రస్ధాయిలో పరిస్ధితి అందుకు భిన్నంగా ఉందని అన్నారు.
శ్రేణుల్లో నైతిక స్ధైర్యం నింపేందుకే బీజేపీ నేతలు 400 స్ధానాలు సాధిస్తామని చెబుతున్నారని, వాస్తవానికి కనీసం వారు 200 సీట్లు కూడా దాటే పరిస్ధితి లేదని లాలూ ప్రసాద్ యాదవ్ స్పష్టం చేశారు. తాను గతంలో మండల్ కమిషన్ను అమలు చేశానని ఆయన గుర్తుచేశారు.
రిజర్వేషన్లు అనేది సామాజిక ప్రాతిపదికన ఉంటాయని మతపరమైనవి కాదని లాలూ యాదవ్ స్పష్టం చేశారు. అటల్ బిహారి వాజ్పేయి రిజర్వేషన్లపై రాజ్యాంగ సమీక్ష కమిషన్ను ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. ఇక లోక్సభ ఎన్నికల మూడో దశ అనంతరం ఇండియా కూటమికి అనుకూలంగా ఫలితాలు రానున్నాయనేది వెల్లడైందని చెప్పారు.
Read More :
Mulugu | కత్తులతో బెదిరించి దేవాదుల పంప్ హౌస్లో చోరీకి పాల్పడ్డ దుండగులు.. వీడియో