ములుగు: ములుగు జిల్లా (Mulugu) కన్నాయిగూడెంలో దేవాదుల పంప్ హౌస్లో భారీ చోరీ జరిగింది. సోమవారం అర్ధరాత్రి కన్నాయిగూడెం మండలంలోని సబ్ స్టేషన్ వద్ద దేవాదుల పంప్ హౌస్లో విధులు నిర్వహిస్తున్న సబ్బందిని కత్తులతో బెదిరించిన దుండగులు.. విలువైన సామగ్రిని ఎత్తుకెళ్లారు. ఇదంతా అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డయింది.
పంప్ హౌస్కు చెందిన సిబ్బంది పడుకొని ఉన్నారు. అర్ధరాత్రి అక్కడికి చేరుకున్న ఐదుగురు గుర్తుతెలియన వ్యాక్తులు వారిని నిద్రలేపి.. కత్తులతో బెదిరించారు. ఓ మంచంపై ఉన్న సిగరెట్లు తీసుకున్న ఇద్దరు దుండగులు.. ఎంచక్కా వాటిని వెలిగించుకున్నారు. అనంతరం వారిని పంప్ హౌస్లోకి తీసుకెళ్లి వస్తువులను అక్కడి నుంచి తీసుకెళ్లారు. సిబ్బంది ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దుండగులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
కత్తులతో బెదిరించి పంప్ హౌజ్లో చోరీకి పాల్పడ్డ దుండగులు
ములుగు – కన్నాయిగూడెం మండలం సబ్ స్టేషన్ వద్ద దేవాదుల పంప్ హౌజ్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని అర్ధరాత్రి కత్తులతో బెదిరించి విలువైన సామగ్రిని దోచుకెళ్ళిన దుండగులు.
సీసీ పుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి దుండగుల కోసం… pic.twitter.com/nbfyqnzhry
— Telugu Scribe (@TeluguScribe) May 7, 2024