Peddi Sudarshan Reddy: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి(Peddi Sudarshan Reddy)కి వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నామని సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రి(Yashoda Hospital) వైద్యులు తెలిపారు. హఠాత్తుగా గుండెపోటుకు గురై వరంగల్లోని రోహిణి ఆస్పత్రిలో సీపీఆర్ అనంతరం యశోదలో చేరిన ఆయనకు అందిస్తున్న ట్రీట్మెంట్ వివరాలను డాక్టర్లు వెల్లడించారు. మంగళవారం పెద్ది హెల్త్ బులెటిన్ ప్రకటిస్తూ.. అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ యూనిట్లో నిపుణుల బృందం తీవ్రంగా ప్రయత్నిస్తోందని చెప్పారు.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై యశోద హాస్పిటల్స్ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. భారీ పల్నొనరీ ఎంబోలిజంతో షాక్కు గురైనందున సుదర్శన్ రెడ్డికి గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయనకు వరంగల్లోని రోహిణి ఆస్పత్రిలో చికిత్స అందించారు. అనంతరం పెద్దిని యశోదకు తరలించారు. సుమారు 45 నిమిషాల పాటు సీపీఆర్ CPR, ACLS నిర్వహించి గుండె స్పందన పునరుద్ధరించాం. (ROSC). వరంగల్లో థ్రాంబోలైసిస్ చికిత్స అందించారు. ప్రస్తుతం అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ యూనిట్లో నిపుణుల బృందం పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. ఇప్పటికీ సుదర్శన్ రెడ్డి
వెంటిలేటర్పై చికిత్స చేస్తున్నామని పేర్కొన్నారు.
తక్కువ మోతాదులో మందులతో పెద్ది రక్తపోటు, ఇతర కీలక అవయవాల పనితీరు నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. అలానే ఆయన శ్వాసక్రియ ప్రస్తుతం వెంటిలేటర్ సాయంతోనే కొనసాగుతోందని పేర్కొన్నారు. ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి మాటలకు, నొప్పి ఉద్దీపనలకు అర్థవంతమైన న్యూరాలజికల్ స్పందన లేదని తెలిపారు.
EEG, MRI బ్రెయిన్, CT స్కాన్లలో మెదడుకు ఆక్సిజన్ లోపం (Anoxic Brain Damage) సూచించే లక్షణాలు కనిపించాయని, 72 గంటల న్యూరాలజికల్ రీ-అసెస్మెంట్ జూలై 29, బుధవారంరేపు నిర్వహిస్తామని వైద్యులు చెప్పారు. రీ-అసెస్మెంట్ అనంతరం పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని హెల్త్ బులెటిన్లో వైద్యులు స్పష్టం చేశారు. పెద్ది ఆరోగ్య పరిస్థితి, చికిత్స వివరాలపై ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తున్నామని యశోదా ఆస్పత్రి అధికారులు వెల్లడించారు.