Dharmapuri Arvind | త్వరలోనే కాంగ్రెస్ సర్కార్ కూలిపోవడం ఖాయమని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. జూన్ 4వ తేదీ తర్వాత కాంగ్రెస్ కనుమరగువుతుందని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం నాడు జక్రాన్పల్లిలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో ధర్మపురి అర్వింద్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ఎన్నికల హామలు అమలు చేయని రేవంత్ రెడ్డికి రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదని అన్నారు. మోదీతోనే దేశంలో సుస్థిర పాలన సాధ్యమని ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు. భారత ముస్లింలకు బీజేపీ అండగా ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం భూములు ఇస్తే.. ఏడాదిలో జక్రాన్పల్లి ఎయిర్ఫోర్టు పూర్తి చేస్తామని తెలిపారు.