Rahul Gandhi | కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi ) ప్రస్తుతం ఇంగ్లాండ్ (England) లో పర్యటిస్తున్నారు. పది రోజుల పర్యటన నిమిత్తం అక్కడికి వెళ్లిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీబిజీగా గడుపుతున్నారు. నిన్న కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో (University of Cambridge) రాహుల్ (Rahul Gandhi) ప్రసంగించిన విషయం తెలిసిందే. ప్రసంగం సందర్భంగా భారత ప్రభుత్వం (Governament Of India) పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి జరుగుతోందని.. విపక్ష నేతలపై నిఘా కోసం ప్రభుత్వం పెగాసస్ (Pegasus)ను వినియోగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. పర్యటనలో భాగంగా రాహుల్ (Rahul) బ్రిటన్ పార్లమెంట్ (British Parliament)లో ప్రసంగించనున్నారు.
మార్చి 6వ తేదీన వెస్ట్మినిస్టర్ (Westminster) ప్యాలెస్లోని గ్రాండ్ కమిటీ రూమ్ (Grand Committee Room)లో యూకే ఉభయ సభల ఎంపీలను (addressing the UK MPs) ఉద్దేశించి రాహుల్ ప్రసంగించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తాజాగా వెల్లడించాయి. ఈ విషయమై భారత సంతతికి చెందిన యూకే ఎంపీ (Uk MP of Indian origin) వీరేంద్ర శర్మ (Virendra Sharma) మాట్లాడుతూ.. రాహుల్ కేవలం రాజకీయాలపై (political future) మాత్రమే కాదని, ఇరు దేశాల మధ్య ఉన్న సంస్కృతి (cultural) , సామాజిక (social), వ్యాపార బంధాలపై ( business ties) ప్రసంగిస్తారని అని అన్నారు.
Also Read..
China | అమ్మాయిల లోదుస్తుల ప్రకటనల్లో అబ్బాయిలు.. చైనా వ్యాపారుల కొత్త పంథా..!
Manish Sisodia | నేడు సీబీఐ కోర్టుకు సిసోడియా.. ఢిల్లీ కోర్టులో బెయిల్ పిటిషన్
Australia | ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయంపై దాడి.. ప్రహరీ గోడ ధ్వంసం..!