Rahul Gandhi : నరేంద్ర మోదీ ప్రభుత్వం రైల్వేలను నిర్వీర్యం చేస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వ హయాంలో రైలు ప్రయాణం శిక్షగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రయాణీకులు తమ రైలు ప్రయాణంలో అసౌకర్యానికి గురైన వీడియో క్లిప్ను రాహుల్ సోషల్ మీడియా వేదిక ఎక్స్లో షేర్ చేశారు.
విలాసవంతమైన రైళ్లను ప్రోత్సహించేందుకు మోదీ ప్రభుత్వం సామాన్యులు ప్రయాణించే రైళ్లలోని జనరల్ కోచ్ల సంఖ్యను తగ్గించడంతో సాధారణ ప్రయాణీకులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని రాహుల్ గాంధీ ఈ పోస్ట్లో రాసుకొచ్చారు. టికెట్లు కన్ఫాం అయిన ప్రయాణీకులు కూడా ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
సామాన్య ప్రయాణీకులు రైలు ఫ్లోర్పై కూర్చోవడంతో పాటు టాయ్లెట్స్లో బలవంతంగా ప్రయాణించాల్సి వస్తోందని అన్నారు. టికెట్స్ కన్ఫాం అయిన ప్రయాణీకులు సైతం తమ సీట్లలో కూర్చోలేకపోతున్నారని అన్నారు. రైల్వేలను బలహీనపరిచి దాన్ని తన స్నేహితులకు విక్రయించాలని బీజేపీ కోరుకుంటోందని దుయ్యబట్టారు. సామాన్య ప్రయాణీకులను కాపాడాలంటే రైల్వేలను దోచుకుంటున్న మోదీ ప్రభుత్వాన్ని సాగనంపాలని రాహుల్ గాంధీ ప్రజలను కోరారు.
Read More :
Prabhas | సూపర్ కూల్ స్టైలిష్ లుక్లో ప్రభాస్.. ఇంతకీ ఎక్కడికి వెళ్లాడో తెలుసా..?