Loksabha Elections 2024 : మోదీ సర్కార్ లక్ష్యంగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. కర్నాటకలోని కోలార్లో బుధవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ మాట్లాడుతూ భారత్లో 24 ఏండ్ల పాటు జాతీయ ఉపాధి హామీ పధకాన్ని నడిపేందుకు అవసరమైన మొత్తాన్ని 22 మంది వ్యక్తులకు పంచేశారని ఆరోపించారు.
తాము కేంద్రంలో అధికారంలో ఉండగా వ్యవసాయ రుణాలు మాఫీ చేశామని గుర్తుచేశారు. ఇవాళ దేశంలో కోట్లాది రైతుల రుణాలను 24 ఏండ్ల పాటు మాఫీ చేసినా ప్రధాని మోదీ 25 మంది బడా సంపన్నులకు అప్పగించిన నిధుల కంటే తక్కువే అవుతుందని అన్నారు.
22 మంది పారిశ్రామిక దిగ్గజాలకు ప్రధాని మోదీ దోచిపెట్టిన తీరు రైతులను అవమానించినట్టేనని, వారి కుటుంబాలకు ద్రోహం చేసినట్టేనని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. దేశంలో 70 కోట్ల మంది వద్ద ఉన్న డబ్బుతో సమానంగా 22 మంది వ్యక్తుల వద్ద సంపద పోగుపడిందని పేర్కొన్నారు.
Read More :
Viral Video | బైక్ను ఢీకొట్టి రెండు కిలోమీటర్లు ఆపకుండా ఈడ్చుకెళ్లిన లారీ డ్రైవర్..