Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్కు రాజీనామా చేసిన రాజస్దాన్ నేత రాధిక ఖేరా మంగళవారం కాషాయ పార్టీలో చేరారు. ఏఐసీసీ ప్రతినిధి రాధిక ఖేరా ఆదివారం కాంగ్రెస్ పార్టీని వీడారు. పార్టీ అగ్రనేతల వేధింపులు భరించలేకే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ఆమె వెల్లడించారు.
అయోధ్యలో రామ మందిరాన్ని తాను సందర్శించడం కాంగ్రెస్ అగ్రనేతలకు ఆగ్రహం తెప్పించిందని రాధిక పేర్కొన్నారు. చత్తీస్ఘఢ్కు చెందిన పార్టీ నేతలు తనను గదిలో బంధించి వేధింపులకు గురిచేశారని ఆమె ఆరోపించారు. పార్టీ పెద్దలకు తాను ఫిర్యాదు చేసినా వారు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ హిందువుల వ్యతిరేక పార్టీ అని కాషాయ పార్టీలో చేరిన అనంతరం రాధిక పేర్కొన్నారు.
రాముడి దర్శనం చేసుకున్నందుకు తనను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా హింసించడం అమానుషమని అన్నారు. బీజేపీ ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం అండ లేకుంటే తాను ఇక్కడకు చేరుకునేదాన్ని కాదని ఆమె వాపోయారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మహాత్మ గాంధీ కాంగ్రెస్ కాదని, ఇది హిందూ వ్యతిరేక, రాముడి వ్యతిరేక కాంగ్రెస్ అని రాధిక దుయ్యబట్టారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో రాధికతో పాటు ప్రముఖ నటుడు శేఖర్ సుమన్ కూడా కాషాయ పార్టీలో చేరారు.
Read More :
SR Nagar | హాస్టల్లో నీళ్లు వాడుకున్నాడని యువకుడిపై దాడి