హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ) : ఆగస్టు రెండో వారం వచ్చినా సరైన వర్షాలు కురువకపోవడంతో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా, గోదావరి నదుల పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు కురువాలని కోరుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు నాగార్జునసాగర్లోని విజయవిహార్ గెస్ట్హౌస్ ప్రాంగణంలో వరుణయాగం నిర్వహించనున్నది.
108 మంది రుత్వికులు, 11 హోమగుండాలతో ఈ యాగాన్ని నిర్వహిస్తారు. 2:45 గంటలకు నాగార్జునసాగర్ హిల్కాలనీలోని బీసీ రెసిడెన్షియల్ పాఠశాలకు చేరుకోనున్న సీఎం రేవంత్రెడ్డి, అక్కడి నుంచి విజయవిహార్కు చేరుకొని పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొననున్నారు.