Suicide | నిజామాబాద్లో తీవ్ర విషాదం నెలకొంది. పోలీస్ హెడ్క్వార్టర్స్లోనే ఆర్ఐగా విధులు నిర్వహిస్తున్న సతీశ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటనతో పోలీస్ శాఖలో తీవ్ర విషాదం నెలకొంది.
ఆర్ఐ ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలియగానే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ సాయిచైతన్య సంఘటనాస్థలిని పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆర్థిక ఇబ్బందులతోనే సతీశ్ ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.