Loksabha Elections 2024 : కాంగ్రెస్ పార్టీ తన తీరు మార్చుకోలేదని అవినీతి, బంధుప్రీతిని ఆ పార్టీ ప్రోత్సహిస్తోందని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి అన్నారు. హరియాణలోని పానిపట్లో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
ఓవైపు ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళుతుంటే కాంగ్రెష్ మాత్రం ఈ ఎన్నికల్లో కూడా అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. మరోవైపు లోక్సభ ఎన్నికల ప్రచారంలో కాషాయ పార్టీ లక్ష్యంగా సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ విమర్శలు గుప్పించారు.
గత పదేండ్ల బీజేపీ హయాంలో పారిశ్రామికవేత్తల రుణాలు రూ. 25 లక్షల కోట్లు మాఫీ చేశారని ఆరోపించారు. యూపీలోని అజాంఘఢ్లో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడారు.జూన్ 4 తర్వాత బీజేపీ బడా పారిశ్రామికవేత్తల రుణాలను మాఫీ చేస్తుందని, అయితే విపక్ష ఇండియా కూటమి అధికారంలోకి వస్తే పారిశ్రామికవేత్తల రుణాలు కాకుండా పేదలు, రైతులు, గ్రామాల్లో నివసిస్తున్న సామాన్యుల రుణాలను మాఫీ చేస్తామని అఖిలేష్ యాదవ్ హామీ ఇచ్చారు.
Read More :
Nita Ambani: ఈ సీజన్ నిరుత్సాహపరిచింది: నీతా అంబానీ