ముంబై: ఈ యేటి ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ చాలా దారుణంగా పర్ఫార్మ్ చేసింది. 14 మ్యాచుల్లో ఆ జట్టు నాలుగు మ్యాచుల్లో నెగ్గి 8 పాయింట్లతో పట్టికలో పదో స్థానంలో నిలిచింది. ఈసారి ముంబై జట్టుకు హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో ఆ జట్టు ముందు నుంచి సరైన ఆటను ప్రదర్శించలేదు. పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించడం కూడా వివాదాస్పదమైంది. ప్లే ఆఫ్స్కు అర్హత సాధించకపోవడంతో .. ఆ జట్టు ఓనర్ నీతా అంబానీ(Nita Ambani).. ముంబై ప్లేయర్లకు సెండాఫ్ ఇచ్చింది.
ప్రస్తుత సీజన్ చాలా నిరుత్సాహకరంగా ముగిసినట్లు నీతా అంబానీ పేర్కొన్నారు. అయితే ఎందుకు అలా వెనుకబడిపోయామన్న దానిపై సమీక్ష నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. ముంబై ఇండియన్స్కు చెందిన సోషల్ మీడియా అకౌంట్లో వీడియోను షేర్ చేశారు. ముంబై ఇండియన్స్ ప్లేయర్లతో నీతా మాట్లాడారు. ఒక ఓనర్గా మాత్రమే కాకుండా, ఓ అభిమానిగా కూడా తాను మాట్లాడుతున్నట్లు చెప్పారు.
నిజానికి ఈ సీజన్ మనందర్నీ నిరుత్సాహరించిందన్నారు. మనం అనుకున్నట్లు పరిస్థితులు వెళ్లలేదన్నారు. అయినా కానీ తాను ముంబై ఇండియన్స్ జట్టుకు అతి పెద్ద అభిమానిని అని పేర్కొన్నారు. ఓనర్గా మాత్రమే కాకుండా, ముంబై ఇండియన్స్ జెర్సీని వేసుకోవడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ సీజన్లో జరిగిన దాని గురించి సమీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
టీ20 వరల్డ్కప్కు ఎంపికైన ఆ జట్టు ఆటగాళ్లు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాలకు ఆమె గుడ్లక్ చెప్పారు. ఇండియన్లు అందరూ మీకోసం ఎదురుచూస్తున్నారని, మంచి జరగాలని ఆశిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. జూన్ ఒకటో తేదీన వార్మప్లో బంగ్లాదేశ్తో, ఆ తర్వాత తొలి మ్యాచ్ ఐర్లాండ్తో జూన్ 5వ తేదీన ఇండియా ఆడనున్నది.
Mrs. Nita Ambani talks to the team about the IPL season and wishes our boys all the very best for the upcoming T20 World Cup 🙌#MumbaiMeriJaan #MumbaiIndians | @ImRo45 | @hardikpandya7 | @surya_14kumar | @Jaspritbumrah93 pic.twitter.com/uCV2mzNVOw
— Mumbai Indians (@mipaltan) May 19, 2024