Mercedes Car | ఓ వ్యక్తి బెంజ్ కారులో రేషన్ దుకాణానికి వచ్చాడు. తనకున్న నీలి రంగు కార్డును చూపించి గోధుమలను తీసుకెళ్లాడు. బెంజ్ కారు కలిగిన వ్యక్తికి నీలి రంగు రేషన్ కార్డు ఎలా జారీ చేస్తారని నెటిజన్లు, సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్లోని హోషియాపూర్కు చెందిన ఓ వ్యక్తి బెంజ్ కారులో రేషన్ షాప్ వద్దకు వచ్చాడు. ఇక తనకున్న రేషన్ కార్డు(నీలి రంగు కార్డు)ను చూపించాడు. డీలర్ అమిత్ కుమార్ అతనికి ఉచితంగా ఇవ్వాల్సిన గోధుమలను అందజేశాడు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి.. ఈ ఘటనను గమనిస్తూ తన మొబైల్లో చిత్రీకరించాడు. ఆ తర్వాత వైరల్ చేశాడు.
ఈ వ్యవహారంపై డీలర్ అమిత్ కుమార్ను విలేకరులు ప్రశ్నించగా, బెంజ్ కారులో వచ్చిన వ్యక్తికి బీపీఎల్ కుటుంబాలకు ఇచ్చే నీలి రంగు కార్డు ఉందన్నారు. ఆ కార్డును పరిశీలించిన తర్వాతే ఉచితంగా ఇచ్చే గోధుమలను ఇచ్చామని తెలిపారు. మొత్తానికి ఈ వివాదం ప్రభుత్వ ఉన్నతాధికారులకు చేరడంతో.. నీలి రంగు కార్డులను పరిశీలించాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇక బెంజ్ కారులో వచ్చి గోధుమలను తీసుకెళ్లిన వ్యక్తి కూడా ఈ ఘటనపై స్పందించాడు. బెంజ్ కారు తనది కాదని తెలిపాడు. కారు ఓనర్స్ ప్రస్తుతం ఇక్కడ ఉండటం లేదని, అవసరం వచ్చినప్పుడు తాను ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నాడు. కేవలం డిజీల్ తోనే ఈ వాహనాన్ని నడుపుతున్నట్లు చెప్పాడు. ఇక తాను చాలా పేద వ్యక్తినని చెప్పిన ఆయన.. తన పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదవిస్తున్నాని స్పష్టం చేశాడు.
#Punjab person arrived in a Mercedes to buy free wheat under the Ata Dal scheme by Punjab Government. A video of #Hoshiarpur Naloyan Chowk is going viral pic.twitter.com/9WHYN6IOaq
— Parmeet Singh Bidowali (@ParmeetBidowali) September 6, 2022