Pune | మహారాష్ట్రలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పట్టపగలే వృద్ధ దంపతులను దుండగులు దోచుకున్నారు. రూ.లక్షల విలువైన నగలను (Jewellery) దోచుకెళ్లారు. గురువారం మధ్యాహ్నం పుణెలో ఈ ఘటన చోటు చేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. ఓ జంట గురువారం మధ్యాహ్నం సమయంలో బ్యాంకు నుంచి ద్విచక్ర వాహనంపై ఇంటికి బయల్దేరారు. దారి మధ్యలో ఓ దుకాణంలో వడపావ్ (Vada Pav) తినేందుకు బైక్ను ఆపారు. మహిళ బైక్ వద్దే ఉండగా.. నగలు, బ్యాంకు పత్రాలున్న సంచిని స్కూటీ ముందు భాగంలో ఉంచి ఆమె భర్త షాపులోకి వెళ్లాడు. కాసేపటికి తెల్లచొక్కా ధరించిన ఓ వ్యక్తి స్కూటీ వద్ద అటూఇటూ తిరిగాడు. అప్పుడే ఓ వ్యక్తి బైక్పై అటుగా వెళ్తాడు. కొన్ని సెకన్లలోనే మళ్లీ రాంగ్రూట్లో స్కూటీ వద్దకు వచ్చి బండి ఆపుతాడు.
అక్కడ నిల్చొని ఉన్న మహిళకు రోడ్డుపై ఏదో పడిపోయిందని సైగ చేస్తాడు. దీంతో సదరు మహిళ కిందకు వంగి తీసుకుంటుండగా.. అక్కడే ఉన్న తెల్ల చొక్కా వ్యక్తి స్కూటీ ముందు భాగంలో ఉన్న సంచిని తీసుకుని అక్కడి నుంచి ఉడాయిస్తాడు. వెంటనే తెరుకున్న మహిళ గట్టిగా కేకలు వేస్తూ దుండగుడి వెనుక పరిగెడుతుంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియో వైరల్గా మారింది. ఆ సంచిలో రూ.5లక్షల విలువైన నగలు, బ్యాంకు పత్రాలు, సెల్ ఫోన్ ఉన్నట్లు బాధిత జంట తెలిపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దుండగుల్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
A couple’s gold jewellery valued at ₹ 4.95 lakh was stolen while they paused to buy vada pav after picking it up from a bank. The incident took place on Thursday outside a vadapav shop in Shewalewadi.#goldchain #shewalewadi #Pune #punepolice #robbery pic.twitter.com/oFYGmuTso4
— Pune Pulse (@pulse_pune) August 30, 2024
Also Read..
Donald Trump | ట్రంప్ ర్యాలీలో మరోసారి భద్రతా వైఫల్యం.. స్టేజ్వైపు దూసుకొచ్చిన దుండగుడు
Samantha | హేమ కమిటీ రిపోర్ట్ను స్వాగతించిన సమంత.. తెలంగాణ ప్రభుత్వానికి కీలక విజ్ఞప్తి