కుమ్రం భీం ఆసిఫాబాద్ జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి
జిల్లా ఇన్చార్జి ఎస్పీ , రామగుండం సీపీ సత్యనారాయణ, ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి సీసీ కెమెరాల ప్రారంభం
కరపత్రాలు విడుదల చేస్తున్న జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి, జిల్లా ఇన్చార్జి ఎస్పీ, సీపీ సత్యనారాయణ, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఎస్పీ సుధీంద్ర
ఆసిఫాబాద్,జూన్ 21 : జిల్లాలో నేర నియంత్రణలో పోలీస్ చర్యలు భేష్గా ఉన్నాయని కుమ్రం భీం ఆసిఫాబాద్ జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి అన్నారు. పట్టణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సీపీ సత్యనారాయణ, ఎస్పీ వైవీఎస్ సుధీంద్ర, ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీసీ కెమెరాల ఏ ర్పాటుతో మరింత నిఘా ఉంటుందన్నారు. అనంతరం సీపీ సత్యనారాయణ మాట్లాడుతూ పట్టణంలో మొత్తం 109 సీసీ కెమెరాలను బిగించామన్నారు. ఇందుకు స హకరించిన కలెక్టర్ రాహుల్రాజ్కు, స్థానిక వ్యాపారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నేర పరిశోధన లో సీసీ కెమెరాలు కీలకంగా మారుతున్నాయన్నారు. ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాట్లాడుతూ పోలీసులు శాంతిభద్రతలే కాకుండా మారుమూల గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టడం అభినందనీయమన్నారు. ఎస్పీ వైవీఎస్ సుధీంద్ర మాట్లాడుతూ జిల్లాకేంద్రంలోనే కాకుం డా చిర్రకుంట, మోతుగూడ, ఇదులవాడ, చిలాటిగూ డ తదితర గ్రామాల్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని చెప్పారు. అనంతరం సీసీ కెమెరాలపై అవగాహన కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏఎస్పీ అచ్చేశ్వర్రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవరావు, ఎంపీపీ అరిగెల మల్లికార్జున్ యాదవ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గాదెవేణి మల్లేశ్, సీఐ అశోక్, ఎస్ఐలు వెంకటేశ్, రాజేశ్వర్, గంగన్న, వ్యాపారులు గుండా వెంకన్న, ప్రమోద్, అజీత్, అశోక్, ప్రదీప్, నాయకులు రమేశ్, దినాకర్, రవీందర్, వ్యాపారులు పాల్గొన్నారు.
గిరి గ్రామాలభివృద్ధికి కృషి..
గిరి గ్రామాలభివృద్ధికి కృషి చేస్తున్నామని జిల్లా ఇన్చార్జి ఎస్పీ ,రామగుండం సీపీ సత్యనారాయణ అన్నారు. ‘పోలీసులు మీ కోసం’ లో భాగంగా వాంకిడి మండలంలోని సర్కెపల్లికి నూతనంగా వేసిన మట్టి రోడ్డును ఎస్పీ వైవీఎస్ సుధీంద్రతో, అచ్చేశ్వర్రావుతో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీస్శాఖ ద్వారా కొలాంగూడ నుంచి సర్కెపల్లి వరకు కిలోమీటర్ మేర రోడ్డు వేశామన్నారు. అనంతరం గిరిజన కుటుంబాలకు బియ్యం, యువతకు వాలీబాల్ కిట్లను పంపిణీ చేశారు. గ్రామానికి రోడ్డు, విద్యుత్, నీటి సౌక ర్యం కోసం కృషి చేసిన సీఐ సుధాకర్, ఎస్ఐ రమేశ్ను సీపీ అభినందించారు. అంతకుముందు గిరిజనులు వారికి డప్పు,వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు.