బారికేడ్లను బ్రేక్ చేసిన అన్నదాతలు.. వీడియో

న్యూఢిల్లీ : నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో ట్రాక్టర్ల ర్యాలీకి అన్నదాతలు పిలుపునిచ్చిన విషయం విదితమే. రైతుల ట్రాక్టర్ పరేడ్కు పోలీసులు కూడా అనుమతిచ్చారు. దీంతో కిసాన్ గణతంత్ర పరేడ్ పేరుతో రైతులు కవాతు నిర్వహించనున్నారు. అయితే సింఘూ బోర్డర్ వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను రైతులు తొలగించారు. బారికేడ్లను పక్కకు తోసి.. ఢిల్లీ వైపు 5 వేల మందికి పైగా రైతులు ర్యాలీగా వెళ్తున్నారు. అన్నదాతలంతరూ జాతీయ జెండాలను చేతబూని ప్రదర్శన నిర్వహిస్తున్నారు. హర్యానా, ఢిల్లీ సరిహద్దుల్లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రైతుల ఆందోళనలకు సింఘూ బోర్డర్ ప్రధాన కేంద్రంగా మారిన విషయం తెలిసిందే. రిపబ్లిక్ డే పరేడ్ ముగిసిన తర్వాత రైతుల ట్రాక్టర్ పరేడ్ ఉంటుంది. ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘూ, టిక్రి, ఘాజీపూర్ పాయింట్ల నుంచి మొదలయ్యే ర్యాలీలో 2 లక్షల ట్రాక్టర్లు పాల్గొంటాయని రైతులు తెలిపారు.
#WATCH Protesting farmers break police barricading at Delhi-Haryana Tikri border
— ANI (@ANI) January 26, 2021
Farmers are holding tractor rally today in protest against Centre's three Farm Laws#RepublicDay pic.twitter.com/3tI7uKSSRM
తాజావార్తలు
- పవర్ ఫుల్ ఉమెన్స్తో వకీల్ సాబ్.. పోస్టర్ వైరల్
- భారత్కు ఎగువన బ్రహ్మపుత్రపై డ్యామ్స్.. చైనా గ్రీన్సిగ్నల్
- మెదక్ జిల్లాలో మహిళపై యాసిడ్ దాడి
- మెన్స్ డేను కూడా సెలబ్రేట్ చేయాలి : ఎంపీ సోనాల్
- ఉమెన్స్ డే స్పెషల్: విరాట పర్వం నుండి అమెజింగ్ వీడియో
- మునగాలలో అదుపుతప్పి బోల్తాపడ్డ కారు.. మహిళ మృతి
- రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీల ఆందోళన
- అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు: మహేష్
- వరుసగా మూడో రోజూ 18 వేల కరోనా కేసులు
- రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా మల్లికార్జున్ ఖర్గే